Friday, May 3, 2024

పట్టణ, పల్లె ప్రజలంతా బీఆర్‌ఎస్‌తోనే..: మంత్రి జగదీష్‌రెడ్డి

తప్పక చదవండి

సూర్యాపేట : ఎన్నికల ప్రచారం సందర్బంగా బిఆర్‌ఎస్‌ పట్ల ప్రజల చూ పిస్తున్న ఆదరణ సూర్యాపేటలో గెలుపును ఖాయం చేసిం దని రాష్ట్ర మంత్రి, సూర్యాపేట బిఆర్‌ఎస్‌ అభ్యర్ధి గుంట కండ్ల జగదీష్‌ రెడ్డి పేర్కొన్నారు. సూర్యాపేట లోని అన్ని మండల కేంద్రాలు, పట్టణ కేంద్రంలో కార్యకర్తల సమా వేశం లో పాల్గొన్న మంత్రి ఎన్నికలపోలింగ్‌ సమీపి స్తున్న తరుణంలో అనుసరిం చాల్సిన విధి విధానాలపై శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.ఈ సంద ర్భంగా మంత్రి మాట్లాడు తూ,రాబోయే ఐదు రోజులే సూర్యా పేట భవిష్యత్తును మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది అన్నారు. పల్లె, పట్టణ ప్రజ లంతా బిఆర్‌ఎస్‌ తోనే ఉన్నారన్న మంత్రి, ప్రచారంలో ప్రజ లు చూపిస్తున్న ఆదరణతో గెలుపు విష యంలో డోకా లేదు.హ్యాట్రిక్‌ ఖాయం అన్నారు. చేయాల్సిం దల్లా సమిష్టిగా పని చేసీ ,భారీ మెజారిటీ సాధించాలని అన్నారు. నాయకుల మధ్య ఐక్యతే పార్టీకి శ్రీరామరక్ష అన్న మంత్రి, గడప గడపకు సంక్షేమ పథకాలను వివరించి, లబ్ధిదారులతో మమేకం అవ్వండి అని పిలుపునిచ్చారు. ఓటర్‌ లిస్ట్‌ను అవపోసన పట్టడం అనేది ఎన్నికలలో ముఖ్య ఘట్టం అన్నారు.మీ గ్రామానికి చెందిన ఓటర్‌ లిస్ట్‌ పై స్పష్టమైన అవగాహన ఉండాలనీ కోరారు. నాయకులు ఇగోలను పక్కన పెట్టి ఒకటై పని చేస్తే మండలానికి పది వేల మెజార్టీ రావడం ఖాయం అన్నారు.కాంగ్రెస్‌ జెండాతో కొట్లాటలు తప్పా పథకాలు రావన్న మంత్రి, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి గాండ్రిరపులు తప్పా ఈ ప్రాంతాన్ని ఉద్ధరించింది ఏమీ లేదన్నారు ఈ ఐదు రోజులు అన్ని పనులు పక్కనపెట్టి ప్రజలమధ్యనే ఉండి ప్రజలకు సంక్షేమ పథకాలను వివరించి రాబోయే విజయం లో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్ర మం లో జడ్పీ వైస్‌ చైర్మన్‌ గోపగాని వెంకటనారాయణ గౌడ్‌, సత్యనారాయణ రెడ్డి, పార్టీ నాయకులు ,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు