Sunday, April 28, 2024

మారేడ్‌పల్లి డబుల్‌ బెడ్‌ రూమ్‌లలో భారీ కుంభకోణం

తప్పక చదవండి
  • కంటోన్మెంట్‌ బీజేపీ అభ్యర్థి శ్రీగణేష్‌

కంటోన్మెంట్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌) : మారేడ్‌ పల్లిలో ప్రభుత్వం పేదల కోసం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల కేటాయింపులో భారీ కుంభకోణం జరి గిందని కంటోన్మెంట్‌ బిజెపి అభ్యర్ధి శ్రీ గణేష్‌ ఓ వీడియోను బయటపెట్టారు.శుక్రవారం నాడు మారేడ్‌ పల్లిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక కార్పొరేటర్‌ కొంతం దీపిక, బిజెపి శ్రేణులతో కలిసి పర్యటించిన అయన అక్కడి డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల బాధితులతో మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ అభ్యర్ధి లాస్య నందిత డబు ల్‌ బడ్‌ రూమ్‌ ల కోసం లచం తిరుకుందని ఆరోపించారు.అసలైన లబ్దిదారులకు కాకుం డా వేరే వ్యక్తులకు దివంగత ఎమ్మెల్యే సాయన్న కుటుంబ సభ్యులు అమ్ముకున్నారని ఆరో పించారు.ఇప్పటికైనా మంత్రి తలసాని చొరవ తీసుకుని ఎవరైతే బాధితులు ఉన్నరో వారికి డబ్బులు తిరిగి ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.ఇండ్లు పూర్తి చేసి సం వత్సా రాలు గడుస్తున్న కొంత మంది లబ్ధిదారులకు మాత్రమే ఇచ్చారని అన్నారు.ప్రజల నుంచి తీసుకున్న డబ్బులను తిరిగి చెల్లించకుంటే న్యాయ పోరాటం చేస్తానని శ్రీగణేష్‌ చెప్పారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు