Saturday, May 18, 2024

కాళేశ్వరం సేఫ్టీపై విచారణ

తప్పక చదవండి
  • వివరాలు సమర్పించాలని ప్రభుత్వానికి ఆదేశం

హైదరాబాద్‌ : కాళేశ్వరం ప్రాజెక్ట్‌ సేఫ్టీపై దాఖలైన పిటిషన్‌పై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. మంగళవారం మేడిగడ్డ పిల్లర్‌ కుంగిన ఘటనపై హైకోర్టులో విచారణ జరిగింది. సీబీఐతో విచారణ జరిపించాలని ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ నేత నిరంజన్‌ రెడ్డి పిటిషన్‌ దాఖలు చేశారు. ఘటన జరిగిన సమయంలో నేషనల్‌ డ్యాం సేప్టీ అథారిటీకి పలు ఫిర్యాదులు వెళ్లాయి. వచ్చిన ఫిర్యాదులను అనుసరించి రాష్ట్ర సీఎస్‌కు నేషనల్‌ డ్యాం సేప్టీ అథారిటి లేఖ రాసింది. సీఎస్‌ నుంచి సమాచారం తీసుకుని రెండు వారాల్లోపు పూర్తి వివరాలు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది. ఈమేరకు వవరాలు అందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు