Saturday, May 4, 2024

ఈ-ఫార్ములా రేస్‌ రద్దు

తప్పక చదవండి
  • హైదరాబాద్‌ అభిమానులకు నిరాశ
  • రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన నిర్వాహకులు
  • ఈ రేసింగ్‌ సీజన్‌ 10కు హైదరాబాద్‌ ఎంపిక
  • షెడ్యూల్‌ ప్రకారం ఫిబ్రవరి 10న రేసింగ్‌
  • కొత్త ప్రభుత్వం స్పందించకపోవడంతో రద్దు
  • కాంగ్రెస్‌ నిర్లక్ష్యానికి నిదర్శనమన్న కేటీఆర్‌

హైదరాబాద్‌ వేదికగా జరగాల్సిన ఫార్ములా ఈ-రేస్‌ రద్దయ్చింది. ఈ-రేస్‌ సీజన్‌10 నాలుగో రౌండ్‌ ఫిబ్రవరి 10న హైదరాబాద్‌లో జరగనుండగా నిర్వహాకులు రద్దు చేస్తున్నట్టు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌లో ఫిబ్రవరి 10న జరగాల్సిన ఫార్ములా – ఈ రేస్‌ను రద్దు చేయడం జరిగింది. ఎఫ్‌ఐఏ ఈ నిర్ణయం వెల్లడించింది. ఏర్పాట్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. గతంలో చేసుకున్న ఒప్పందం ఉల్లంఘనపై మున్సిపల్‌ శాఖకు నోటీస్‌ ఇస్తామని ఫార్ములా ఈ రేస్‌ నిర్వాహకులు పేర్కొన్నారు. ఫార్ములా రేసింగ్‌పై నిర్వాహకులు స్పందిస్తూ.. తెలంగాణ ప్రభుత్వ మున్సిపల్‌ శాఖ హోస్ట్‌ సిటీ ఒప్పందాన్ని ఉల్లంఘించిం దన్నారు. గతేడాది అక్టోబర్‌ 30న చేసుకున్న ఒప్పందాన్ని మున్సిపల్‌ శాఖ ఉల్లంఘించిందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. హోస్ట్‌ సిటీ అగ్రిమెంట్‌ చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎఫ్‌ఈవో తెలిపారు. అలాగే, ఫార్ములా రేసింగ్‌ను హైదరాబాద్‌కి బదులుగా హాంకుక్‌ మెక్సికో సిటీలో నిర్వహించనున్నట్టు స్పష్టం చేశారు. ఫార్ములా రేస్‌ రద్దు చేయడంపై మాజీ మంత్రి కేటీఆర్‌ స్పందించారు. ఈ క్రమంలో తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వంపై సీరియస్‌ కామెంట్స్‌ చేశారు. ఫార్ములా రేసింగ్‌ రద్దుపై కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. ఇది నిజంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకున్న దుర్మార్గమైన, తిరోగమన నిర్ణయం. హైదరాబాద్‌ ఈప్రిక్స్‌ వంటి ఈవెంట్‌లు ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్‌ నగరం, భారత్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ పెంచుతాయని సూచించారు. చాలా మంది ఈ రేసింగ్‌ చూడటానికి ఆసక్తి చూపారు. ఇప్పుడు మళ్లీ ఫిబ్రవరిలో జరగాల్సిన ఈరేసింగ్‌పై తెలంగాణ ప్రజలు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రద్దు చేయడం సరైంది కాదు. భారతదేశానికి మొదటిసారిగా ఫార్ములా ఈప్రిక్స్‌ని తీసుకురావడానికి మేము చాలా కృషి, సమయాన్ని వెచ్చించాము. ఇలాంటి చర్యలు నష్టం కలిగిస్తాయి అంటూ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బజ్‌వర్డ్‌గా మారిన ప్రపంచంలో హైదరాబాద్‌ను ఆకర్షణీయమైన పెట్టుబడి కేంద్రంగా మార్చడానికి ఎంతో కష్టపడ్డామన్నారు. ఈవీ ఔత్సాహికులు, తయారీదారులు స్టార్టప్‌లను ఆకర్షిస్తూ ఒక వారం పాటు ఈవీ సమ్మిట్‌ను నిర్వహించడానికి కేసీఆర్‌ ప్రభుత్వం ఫార్ములా ఈ రేస్‌ను ఉపయోగించుకుందని వెల్లడిరచారు. ఫిబ్రవరిలో జరగాల్సిన ఈ-రేసింగ్‌ కోసం తెలంగాణ ప్రజలు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారన్నారు. ఈ తరుణంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ రేసింగ్‌ రద్దు చేయడం సమంజసం కాదన్నారు. ఇలాంటి చర్యలు చాలా నష్టం కలిగిస్తాయంటూ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై కేటీఆర్‌ ఫైర్‌ అయ్యారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు