Saturday, May 18, 2024

కొనసాగుతున్న బదిలీలు

తప్పక చదవండి
  • జీహెచ్‌ఎంసీలో అధికారులకు స్థానచలనం
  • టీజీఓ అధ్యక్షురాలు మమత ట్రాన్సఫర్‌
  • ఉత్తర్వులు జారీ చేసిన దాన కిశోర్‌

తెలంగాణలో అధికారుల బదిలీ కొనసాగుతోంది. మొన్నటి వరకు భారీగా ఐపీఎస్‌, ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేసిన తెలంగాణ సర్కార్‌.. ఇప్పుడు జోనల్‌ అధికారులను కూడా ట్రాన్స్‌ఫర్‌ చేసింది. తాజాగా.. తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల సంఘం అధ్యక్షురాలు, జీహెచ్‌ఎంసీ కూకట్‌పల్లి జోనల్‌ కమిషనర్‌ మమతను బదిలీ చేసింది. ఈ మేరకు మున్సిపల్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ దాన కిశోర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. టీజీవో అధ్యక్షురాలు మమతను నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అర్బన్‌ మేనేజ్‌మెంట్‌ డైరెక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక కూకట్‌పల్లి జోనల్‌ కమిషనర్‌గా ఐఏఎస్‌ అధికారి అభిలాష అభినవ్‌ను నియమించింది. మరోవైపు.. జీహెచ్‌ఎంసీ శేరిలింగంపల్లి జోనల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డి కూడా బదిలీ అయ్యారు. జీహెచ్‌ఎంసీలో శ్రీనివాస్‌రెడ్డి డిప్యూటేషన్‌ను ప్రభుత్వం రద్దు చేసింది. గతంలో చేనేత, జౌళిశాఖ అదనపు డైరెక్టర్‌గా ఉన్న శ్రీనివాస్‌ రెడ్డిని మళ్లీ అక్కడికే సర్కార్‌ బదిలీ చేసింది. ఇక శేరిలింగంపల్లి కొత్త జోనల్‌ కమిషనర్‌గా ఐఏఎస్‌ స్నేహ శబరీష్‌ను నియమించింది. జీహెచ్‌ఎంసీ సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ వెంకట రమణను మూసీ నది అభివృద్ధి సంస్థ ఎస్‌ఈగా బదిలీపై పంపింది. ప్రస్తుతం మూసీ అభివృద్ధి సంస్థ ఎస్‌ఈగా ఉన్న మల్లికార్జునుడును ఈఎన్‌సీ ఆఫీసులో రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు