Thursday, May 16, 2024

గజ్వేల్‌లో కేసీఆర్‌ను ఓడిస్తాం..

తప్పక చదవండి
  • రాష్ట్ర వ్యాప్తంగా కాషాయ జెండా ఎగురవేస్తాం…
  • మఖ్తల్‌ బహిరంగ సభలో పాల్గొన్న ఈటెల రాజేందర్‌..

మక్తల్‌ : రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్‌ వ్యతిరేక గాలి వీస్తోందని… ఈసారి గజ్వేల్‌ లో సైతం కేసీఆర్‌ ను ఓడిస్తామని మాజీ మంత్రి, బీజేపీ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్‌ ఈటెల రాజేందర్‌ అన్నారు. కోలార్‌ ఎంపీ మునిస్వామి, అభ్యర్థి జలంధర్‌ రెడ్డి, రాష్ట్ర నాయకులు కొండయ్య పాల్గొన్న బహిరంగ సభలో మాట్లాడుతూ… అహంకారానికి, ఆత్మగౌరవానికి మధ్య పోరా టం అన్నారు. కేసీఆర్‌ నిరంకుశత్వం తెలుసుకునేందుకు ప్రజలకు పదేళ్లు పట్టిందన్నారు. మఖ్తల్‌ లో ఎమ్మెల్యే అరాచకాలు మితిమీరిపోయాయని… విలేకరులను సైతం భయబ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన వైఫల్యం, అహంకారపు కేసీఆర్‌ కుటుంబ పాలనకు చరమగీతం పాడాలని … గజ్వేల్‌ లో రైతుల భూములపై దౌర్జ్యానికి పాల్పడిన నాయకులపై ఇప్పటివరకు చర్య తీసుకో లేదని.. దళిత బంధు పేరుతో దళితులను మోసం చేశారని అన్నారు. అటుకులు తిని ఉద్యమం చేసిన కేసీఆర్‌కి నేడు వందల కోట్లు ఎక్కడి నుండి వచ్చాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీ దేశంలోనే మొదట సారి బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించిన ఘనత కేవలం నరేంద్ర మోదీ గారికే సాధ్యమైందని అన్నారు. మక్తల్‌ నియోజకవర్గ ప్రజలు ఒకసారి ఆలోచించి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాది రెడ్డి జలంధర్‌ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని అన్నారు. నాయకులు నాగూరావ్‌ నామాజీ, ఉట్కూర్‌ భాస్కర్‌, కర్ని స్వామి, కల్లూరి నాగప్ప, చిట్యాల లక్ష్మణ్‌, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ పావని మల్లికార్జున్‌, వైస్‌ చైర్మన్‌ అఖిల రాజశేఖర్‌ రెడ్డి, వార్డు కౌన్సిలర్లు కొండయ్య, ఈసరి కౌసల్య నాగప్ప, అర్చన గోపి రెడ్డి, చీరాల సత్యనారాయణ, కర్ని లక్ష్మీ, స్థానిక నేతలు తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు