హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ సైతో ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక వ్యవస్థాపక సభ్యులు, సీనియర్ పాత్రికేయులు పాశం యాదగిరి, తెలంగాణ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య, అఖిల భారత వర్కింగ్ జర్నలిస్టుల సంఘం జాతీయ అధ్యక్షులు కె.కోటేశ్వర్ రావు, తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అనంచిన్ని వెంకటేశ్వరరావు, నామాల విశ్వేశ్వరావు, బెలిద హరినాథ్, రవికుమార్, సిహెచ్.వెంకటేశ్వర్లు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో రాజకీయంగా జరుగుతున్న పరిణామాలపై గవర్నర్ కు వారు వివరించారు. ఎన్నికల సందర్భంగా పాత్రికేయులపై జరుగుతున్న దాడుల గురించి, ఇతర నిఘా విషయాలపై వారు చర్చించారు.