Wednesday, May 1, 2024

కలిసి పని చేద్దాం..బహుజన వాదం వినిపిద్దాం..

తప్పక చదవండి
  • బీఎస్పీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వట్టె జానయ్య యాదవ్‌కు టీడీపీ నాయకుల మద్దతు..

సూర్యాపేట : సూర్యాపేట నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ బీఎస్పీ పార్టీకి మద్దతు తెలిపింది. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి నాతాల రామిరెడ్డి బిఎస్పి పార్టీకి మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బహుజనుల కోసం పోరాటం చేస్తున్న బీఎస్పీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వట్టే జానయ్య యాదవ్‌ గెలుపు కోసం ప్రతి టిడిపి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.అధికార అహంతో టిఆర్‌ఎస్‌ పార్టీ బడుగు బలహీన వర్గాలను వంచిస్తుందని అన్నారు.త్వరలో జరగనున్న ఎన్నికల్లో బీఎస్పీ పార్టీని ఏనుగు గుర్తుకు ఓటు వేసి జానయ్య యాదవ్‌ ని గెలిపించాలని కోరారు.అనంతరం బీఎస్పీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వట్టే జానయ్య యాదవ్‌ మాట్లాడుతూ అభివృద్ధి ముసుగులో అవినీతికి పాల్పడుతున్న మంత్రి జగదీశ్‌ రెడ్డి కి తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు. గత నాయకుల పాలనలో సూర్యాపేట నియోజకవర్గ ప్రజలు విసిగి విరక్తి చెందారని అన్నారు.రామన్న స్థానిక ఎన్నికల్లో సైతం తెలుగుదేశం పార్టీ బహుజన సమాజ్‌ పార్టీ సోదర భావంతో ఒకరికి మరొకరం మద్దతు తెలుపుకుంటామని అన్నారు.ఈ విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ జిల్లా పార్లమెంట్‌ కార్యదర్శులు ధరావత్‌ వెంకన్న నాయక్‌, సైదమ్మ, సూర్యాపేట టౌన్‌ అధ్యక్షులు గాజుల వెంకన్న, సూర్యాపేట రూరల్‌ మండల అధ్యక్షులు సౌడోజు వీరాచారి, ఆత్మకూరు మండల కార్యదర్శి ఏర్పుల లింగయ్య, చివ్వెంల మండల కార్యదర్శి చిలకమర్రి గోవిందా చారి, పెన్‌ పహాడ్‌ మండల కార్యదర్శి జనార్ధన చారి, ఉమ్మడి నల్గొండ జిల్లా పార్లమెంటు యూత్‌ అధ్యక్షులు పెదపోలు వినోద్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు