Sunday, April 28, 2024

గెలుపు లాంచనమే…..మెజారిటీ కోసమే సమరం

తప్పక చదవండి
  • మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

రాంగోపాల్ పేట్ : సనత్ నగర్ నియోజవర్గంలో తన గెలుపు లాంచమే నని….. మెజారిటీ కోసమే ఈ సమరం అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.సోమవారం నెక్లెస్ రోడ్డు లోని జలవిహార్ లో సనత్ నగర్ నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ పార్టీ సమావేశం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అద్యక్షతన జరిగింది.ముందుగా ఆయన పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్బంగా పలువురు మాట్లాడుతూ సనత్ నగర్ లోతలసాని శ్రీనివాస్ యాదవ్ గెలుపు ఖాయమిందని,అత్యధిక మెజార్టీ సాధించడం కోసమే కష్టపడాల్సి ఉందని ధీమా వ్యక్తం చేశారు.అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ఈ నెల 19 వ తేదీ నుండి నియోజకవర్గంలో పాదయాత్రలను ప్రారంభించనున్నట్లు చెప్పారు. అదేవిధంగా వచ్చే నెల 9 వ తేదీన భారీ ర్యాలీతో నామినేషన్ దాఖలు చేయనున్నట్లు తెలిపారు. మొత్తం సనత్ నగర్ నియోజకవర్గం నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటుందని తెలిపారు.సనత్ నగర్ నియోజకవర్గంలో 50 సంవత్సరాల నుండి జరగని అభివృద్దిని గడిచిన తొమ్మిదిన్నర సంవత్సరాలలో చేశామని చెప్పారు.చేసిన అభివృద్ధి పనులతోనే ప్రజల్లోకి వెళతామని అన్నారు. వందల కోట్ల రూపాయలను ఖర్చు చేసి ఎన్నో అద్బుతాలను సృష్టించామని చెప్పారు. పార్టీలకు అతీతంగా తమ వద్దకు ఎవరు వచ్చిన వారి సమస్యలను పరిష్కరించామని వివరించారు.గతంలో ఇక్కడి నుండి గెలిచి ముఖ్యమంత్రి గా వ్యవహరించిన మర్రి చెన్నారెడ్డి కూడా చేయలేని అనేక అభివృద్ధి పనులు చేశామని పేర్కొన్నారు.ఎవరికి ఏ అవసరం వచ్చినా తానున్నాను అనే భరోసాను కల్పించామని వివరించారు. తన గెలుపుకోసం ఎంతో శ్రమిస్తున్న ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని మంత్రి శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. ఈ సమావేశంలో కార్పొరేటర్ లు కొలన్ లక్ష్మి, హేమలత, మహేశ్వరి, మాజీ కార్పొరేటర్ లు నామన శేషుకుమారి, ఆకుల రూప, ఉప్పల తరుణి, కిరణ్మయి, డివిజన్ అద్యక్షులు కొలన్ బాల్ రెడ్డి, గుర్రం పవన్ కుమార్ గౌడ్,వెంకటేషన్ రాజు, హన్మంతరావు, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు