- 20తులాల బంగారం, నగదు చోరి..
మిర్యాలగూడ : తాళం వేసిన ఇంటిని కొల్లగొట్టి గుర్తుతెలియని దొంగలు 20 తులాల బంగారు ఆభరణాలు, సుమారు లక్ష రూపాయల నగదు ఎత్తుకు వెళ్ళిన సంఘటన ఆది వారం మిర్యాలగూడ మండలంలోని శ్రీనివాస్నగర్లో వెలుగు చూసింది. బాధితుడు చిలుకూరి వెం కటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం శ్రీనివాస్నగర్లో నివాసముండే వ్యాపారి వెంక టేశ్వర రావు హైదరాబాదులో వుండే తన కుమారుడు డెంగ్యూజ్వరం బారిన పడటంతో భార్య తో కలిసి వారం రోజుల కిందట ఈనెల 18వ తారీఖున ఇంటికి తాళాలు వేసి హైదరాబాద్ వెళ్లానని తెలి పారు. కాగా ఆదివారం పక్కింట్లో ఉండే విద్యాసాగర్ తమ ఇంటి తలుపులు తెరిచి ఉండటం చూసి ఫోన్ చేయడంతో హైదరాబాద్ నుండి హడావుడిగా ఇంటికి చేరుకున్న వారికి తలుపులు, ఇంటి లోని బీరువాలు, కఫ్బోర్డులు తెరిచిఉండటమే గాక బీరువాలో ఉన్న 20తులాలబంగారు వస్తువులు, నగదును గుర్తుతెలియని దొంగలు ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. ఈ విషయమై రూరల్ పోలీస్ స్టేషన్ లో భాధితుడు ఫిర్యాదు చేయడంతో మిర్యాలగూడ డి.ఎస్.పి వెంకటగిరి ఆధ్వర్యంలో ఘటన స్థలాన్ని పరిశీలించారు. నల్లగొండ నుండి క్లూస్ టీం వచ్చి ఆధారాలు సేకరించారు. సమీపంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేయనున్నట్లు డిఎస్పి వెంకటగిరి తెలిపారు.