మిర్యాలగూడ : భారతీయ జనతా పార్టీ(బిజెపి) మిర్యాలగూడ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సాధినేని శ్రీని వాసరావు ను గెలిపించాలని కోరుతూ బుధవారం సాయం త్రం నల్గొండ జిల్లా మిర్యాల గూడ పట్టణంలోని వ్యాపార, వస్త్ర దుకాణాలలో కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శోభ కరంధ్లాజే విస్తృత ప్రచారం నిర్వహించారు. స్థానిక హనుమాన్ పేట ఫ్లైఓవర్ బ్రిడ్జి నుండి రాజీవ్ చౌక్ మీదుగా ఈడులగూడ చౌరస్తా వరకు రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీజేపీ గెలుపుతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. ఈ కార్యక్రమం లో అసెంబ్లీ కన్వీనర్ రతన్ సింగ్, కర్నాటి ప్రభాకర్, రేపాల పురుషోత్తం రెడ్డి, కౌన్సిలర్ రమాదేవి, పట్టణ అధ్యక్ష కార్యదర్శిలు దొండపాటి వెంకట్ రెడ్డి, చిలుకూరి శ్యామ్, బంటు సైదులు, ఎడ్ల రమేష్, బంటు గిరి, బండారు ప్రసాద్, హనుమంత రెడ్డి, పరింగి శ్యామ్, ఎరెడ్ల రామకృష్ణారెడ్డి వేణు, మంద శివ, సరిత లు పాల్గొన్నారు.