- వరల్డ్ కప్ లో నేడు బంగ్లాదేశ్ × శ్రీలంక
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్
- ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించిన బంగ్లా
- ఇవాళ ఓడితే శ్రీలంక కూడా ఇంటికే
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన శ్రీలంకకు తొలి ఓవర్లోనే షాక్ తగిలింది. ఐసీసీ వన్డే వరల్డ్ కప్ లో ఇప్పటికే రెండు సెమీస్ బెర్తులు ఖరారయ్యాయి. టీమిండియా, దక్షిణాఫ్రికా సెమీస్ చేరాయి. ఇక మిగిలింది రెండు బెర్తులు… ఈ రెండు బెర్తుల కోసం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ జట్లు రేసులో ఉన్నాయి. ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరిందన్న నివేదికల నేపథ్యంలో, ఈ మ్యాచ్ జరగడంపై అనిశ్చితి నెలకొంది. ఈ నేపథ్యంలో, టోర్నీలో నేడు ఎలాంటి ప్రాధాన్యం లేని మ్యాచ్ జరుగుతోంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు తలపడుతున్నాయి. షోరిఫుల్ ఇస్లాం వేసిన ఆఖరి బంతికి స్టార్ ఓపెనర్ కుశాల్ పెరీరా(4) ఔటయ్యాడు. ఐదో బంతికి బౌండ్రీ బాదిన అతను ఆ తర్వాత బాల్కు కీపర్ ముష్ఫికర్ రహీంకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దాంతో 5 పరుగులకే లంక తొలి వికెట్ కోల్పోయింది. మరో ఓపెనర్ పథుమ్ నిస్సంక(31) ధాటిగా ఆడుతున్నాడు. ప్రస్తుతం కెప్టెన్ కుశాల్ మెండిస్(2) ఆడుతున్నారు. 7 ఓవర్లకు లంక స్కోర్.. 38/1. శ్రీలంక, బంగ్లాదేశ్ ఢిల్లీ వేదికగా తలపడుతున్నాయి. టాస్ గెలిచిన బంగ్లా కెప్టెన్ షకిబుల్ హసన్ లంకను బ్యాటింగ్కు ఆహ్వానించాడు.