కామారెడ్డి : ‘‘నేను కామారెడ్డి నుంచి నిజామాబాద్ వెళ్లిన విూ గుండెల్లోనే ఉంటా’’ అని మాజీ మంత్రి షబ్బీర్ అలీ అన్నారు. సోమవారం కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో షబ్బీర్ మాట్లాడుతూ కామారెడ్డి నుంచి సీఎం అభ్యర్థి అయిన రేవంత్ రెడ్డి బరిలో ఉంటారని తనకోసం కష్టపడే దాంట్లో రెట్టింపు స్థాయిలో కష్టపడి రేవంత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈనెల 10వ తేదీన రేవంత్ రెడ్డి కామారెడ్డిలో నామినేషన్ వేయనున్నారని నామినేషన్ అనంతరం రేవంత్ రెడ్డితో పాటు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కామారెడ్డి భారీ బహిరంగ సభలో పాల్గొంటారన్నారు. రేవంత్ రెడ్డిని కామారెడ్డి ఎమ్మెల్యేగా గెలిపించి సీఎం కేసీఆర్ను ఇక్కడి నుంచి తరిమి కొట్టాలన్నారు. కామారెడ్డిలో ఉన్న భూములను లాక్కునేందుకే కేసీఆర్ ఇక్కడికి వస్తున్నారని విరుచుకుపడ్డారు. కామారెడ్డి నియోజకవర్గ ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని షబ్బీర్ అలీ కోరారు.