Sunday, April 28, 2024

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం

తప్పక చదవండి
  • కార్గో ట్రక్కును కారు ఢీకొనడంతో నలుగురు దుర్మరణం

ముంబై : మహారాష్ట్ర అహ్మద్‌నగర్‌లోని నాసిక్‌`పూణెళి హైవేపై సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వస్తున్న కార్గో ట్రక్కు కారును ఢీకొని బోల్తాపడిరది. ఈ ఘటనలో కారులోని నలుగురు మృతి చెందారు. మృతుల్లో పసిబిడ్డ కూడా ఉండడం బాధాకరం. మృతులను ఓజస్వి ధంకర్‌ (2), ఆశా సునీల్‌ ధంకర్‌ (42), సునీల్‌ ధంకర్‌ (65), అభయ్‌ సురేష్‌ విశాల్‌ (48)గా గుర్తించారు. ఈ ప్రమాదం ఒకరు గాయాలతో బయటపడ్డారు. గాయాలైన వ్యక్తిని అస్మిత అభయ్‌ విశాల్‌గా గుర్తించారు. అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వేగంగా వస్తున్న కార్గో ట్రక్‌ కారును ఢీకొట్టి బోల్తాపడిరదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో కారు నుజ్జు నుజ్జు కావడంతో అకోలే తాలూకాకు చెందిన నలుగురు ప్రయాణికులు మరణించగా.. ఒకరికి గాయాలయ్యాయని చెప్పారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ట్రక్కులో ఇనుప పైపులు తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం తర్వాత ట్రక్కులోని ఇనుప పైపులన్నీ రోడ్డుపై చెల్లా చెదురుగా పడిపోయాయి. దీంతో హైవేపై ట్రాఫిక్‌ జామ్‌ అయింది. పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు