Wednesday, May 1, 2024

ధాన్యం కోనుగోలును వేగవంతంగా పూర్తిచేయాలి

తప్పక చదవండి
  • జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి

కరీంనగర్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): జిల్లాలో ధాన్యం కొనుగోలును వేగవంతంగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి అధికారులను సూచించారు. మంగళవారం తీగలగుట్టపల్లి, నగునూర్‌ గ్రామాలలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్‌ తో కలిసి ఆమె పరిశీలించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ, రాష్ట్రంలో తూఫాను ప్రభావంతో అకాల వర్షాలు కురుస్తున్నందున జిల్లాలో రైతులకు ఇబ్బందులు కలగకుండా ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాలకు చేరుకున్న ధాన్యం మొత్తం కొనుగోలు వేగవంతంగా పూర్తికావాలని సూచించారు. వెంటనే ట్యాబ్‌ ఎంట్రి పూర్తిచేయాలని, కేంద్రాల్లో దాన్యం తడవకుండ టార్పలిన్లను కప్పాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) లక్ష్మీ కిరణ్‌, డిసిఓ రామానుజాచారి, డియం సివిల్‌ సప్లై రజని కాంత్‌, జిల్లా పౌరసరఫరాల అధికారి సురేష్‌ తదితరులు పాల్గోన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు