Tuesday, April 30, 2024

బీఆర్‌ఎస్‌ను బొందపెట్టి తీరుతాం

తప్పక చదవండి
  • పులి బయటకు వస్తే బోనులో పడేస్తాం
  • కేటీఆర్‌ వ్యాఖ్యలపై రేవంత్‌ గట్టి కౌంటర్‌

హైదరాబాద్‌ : వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను మరింతగా బొందపెట్టడం ఖాయమని సిఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. ఆ పార్టీకి పార్లమెంట్‌ ఎన్నికల్లో ఒక్కసీటు కూడా నెట్టే ఛాన్స్‌ లేదని లండన్‌ పర్యటనలో ఉన్నారు. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి బీఆర్‌ఎస్‌ పార్టీకి గట్టి కౌంటర్‌ ఇచ్చారు. పులి బయటికొస్తుందని ఇటీవల వ్యాఖ్యలు చేసిన కేటీఆర్‌కు రేవంత్‌ రెడ్డి తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. పులి బయటికి వస్తే బోనులో వేసి చెట్టుకు వేళాడదీస్తామని రేవంత్‌ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడంలో భాగంగా సీఎం రేవంత్‌ రెడ్డి ప్రస్తుతం లండన్‌లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం పలు కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఆ తర్వాత అక్కడ ఉన్న తెలంగాణ వ్యక్తులు, కాంగ్రెస్‌ అభిమానులతో రేవంత్‌ భేటీ అయ్యారు. ఆ నేపథ్యంలోనే రేవంత్‌ రెడ్డి లోక్‌సభ ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్‌ పార్టీ చుద్దామన్నా కూడా కనిపించదని వ్యాఖ్యానించారు. అంతేకాదు వచ్చే అసెంబ్లీ ఎన్నికల సమయానికి రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ పార్టీ గుర్తే ఉండదని రేవంత్‌ అన్నారు. కేసీఆర్‌ను పులితో పోల్చిన కేటీఆర్‌ వ్యాఖ్యల నేపథ్యంలో రేవంత్‌ రెడ్డి లండన్‌ వేదికగా స్పందించారు. ఒక్క ఎన్నిక విషయంలోనే బీఆర్‌ఎస్‌ నేతలు బొక్కబోర్లా పడ్డారని ఎద్దేవా చేశారు. అయినప్పటికీ బీఆర్‌ఎస్‌ నేతలకు మాత్రం ఆహంకారం తగ్గలేదన్నారు. వారి గర్వం, అహంకారం తగ్గించే బాధ్యత తనదేనని రేవంత్‌ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ ఓటమిపాలైన తర్వాత వారికి భయం పట్టుకుని ఇలా మాట్లాడుతున్నారని రేవంత్‌ రెడ్డి అన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు