మహబూబ్నగర్ : రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీ నుంచి స్వచ్ఛందంగా బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. తాజాగా ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో వీహెచ్పీ నాయకుడు గుబ్బ భరత్, ఆర్యవైశ్య సంఘం నాయకులు కలకొండ రాఘవేందర్ గుప్తా, విట్యాల రామేశ్వర్, గుండ్ల ప్రమోద్, కొట్ర శ్రీనివాస్, వలకొండ చంద్రశేఖర్, దండు రాఘవేందర్, గౌడంపల్లి శ్రీనివాస్, శేఖర్ మహబూబ్నగర్ పట్టణంలోని మినిస్టర్ క్యాంపు కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కూడా డైరెక్టర్ వేణుగోపాల్, బీఆర్ఎస్ నాయకులు చెరుకుపల్లి రాజేశ్వర్, ఎదిరే ప్రమోద్ కుమార్, రేగూరి కృష్ణ, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు గుండా వెంకటేశ్వర్లు, భీమ శరత్ ఉన్నారు.