Monday, April 29, 2024

ఈటెలపై ఆరోపణలు చేస్తే సహించం

తప్పక చదవండి
  • జనం మెచ్చిన నాయకుడు ఈటెల
  • కెసిఆర్ కు ఓటమి భయంతోనే ఈటెల తప్పుడు ప్రచారం
  • గజ్వేల్ నియోజకవర్గ బిజెపి నాయకులు బండారు మహేష్

గజ్వేల్ : హుజరాబాద్ ఎమ్మెల్యే, గజ్వేల్ బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ పై ఆరోపణలు చేస్తే సహించమని భారతీయ జనతా పార్టీ గజ్వేల్ నియోజకవర్గ నాయకులు బండారు మహేష్ అన్నారు, ఆదివారం గజ్వేల్ లో బిజెపి ఆఫీస్ లో మీడియా సమావేశం నిర్వహించారు, అనంతరం వారు మాట్లాడుతూ శనివారం హుజూరాబాద్ కు చెందిన తిప్పరం సంపత్ అనే వ్యక్తి దళిత ముసుగులో వుండి ఈటెల రాజేందర్ పైన తప్పుడు ప్రచారాలు చేస్తూ చిల్లర రాజకీయాలకు పాల్పడుతూ హుజూరాబాద్ నుండి గజ్వేల్ కి వచ్చి ఈటెల బాధిత సంఘం అని గజ్వేల్ లో ప్రెస్ మీట్ పెట్టడం సిగ్గుమాలిన చర్య అన్నారు. సంపత్ అనే వ్యక్తి ఈటెల దళిత బాధిత సంఘం అని తీసేసి దళిత ముసుగులో వున్న బద్మషి సంపత్ సంఘం అని పేరు పెట్టుకుంటే బాగుంటుంది అన్నారు. గజ్వేల్ లో కెసిఆర్ కు ఓటమి భయంతోనే ఈటెల మీద ఇలాంటి సన్నసులతోని తప్పుడు ప్రచారాలకు తెరలేపుతున్నరు అన్నారు. దళిత ముసుగు వేసుకున్న దద్దమ్మ సంపత్ అనే ముర్కుడు బ్రతికేదే ఈటెల పెరుమిధ అన్నారు ఈటెల గురించి మాట్లాడకపోతే తిండి కూడ దొరకదు అన్నారు, జేబులో డబ్బులు రావాలన్న ఈటెల మీద తప్పుడు కామెంట్లు పెడితేనే వాడికి అవి దొరుకుతాయి అని గుర్తుచేశారు. బస్సు పెట్టి గజ్వేల్ లో పర్యటించి ఈటెల కు ఓటేయ్యోద్దు అని ప్రచారం చేస్తానన్న సన్నాసి గజ్వేల్ లో తిరిగితే దళితులే తరిమి తరిమి బట్టలు హూడగొట్టి కొడతారు అన్నారు. ఈటెల లాంటి గొప్ప వ్యక్తి మంచి వ్యక్తి జనం నచ్చిన మెచ్చిన వ్యక్తి ఈటెల అన్నారు ఎవరెన్ని కుట్రలు కుయుక్తులు చేసిన ఎవరు నమ్మరని నమ్మే పరిస్థితిలో లేరని గుర్తుచేశారు.
ఇంకోసారి ఈటెల గురించి ఎవడైనా తప్పుగా మాట్లాడితే సహించే ప్రసక్తే లేదని తరిమి తరిమి కొడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో గజ్వేల్ పట్టణ అధ్యక్షులు వుప్పల మధు సుధన్ సీనియర్ నాయకులు సిల్వర్ జనార్ధన్ గజ్వేల్ పట్టణ మండల ప్రధాన కార్యదర్శిలు పెండ్యాల శ్రీనివాస్ పాంజాల వెంకటేష్ గౌడ్ ఉపాధ్యక్షులు మైస విజయ్ దలితమొర్చ అసెంబ్లీ కన్వీనర్ అశోక్ సోషల్ మీడియా అసెంబ్లీ కన్వీనర్ అనంద సాయి గౌడ్ తదితరులు పాల్గొన్నారు…

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు