Tuesday, May 14, 2024

మైనంపల్లి కాదు మైనం పిల్లి: మంత్రి మల్లారెడ్డి

తప్పక చదవండి

మేడ్చల్ : మేడ్చల్ నియోజకవర్గం లో ఎన్నికల సమయం దగ్గర పడటం తో అభ్యర్థులు ప్రచారం జోరు పెంచారు..మేడ్చల్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుండి పార్టీ అభ్యర్థి కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి మేడ్చల్ పట్టణం లోని రోడ్డు షో అంబెడ్కర్ విగ్రహం నుంచి ప్రారంభించి మార్కెట్ రోడ్, సంతోష్ మాత గుడి, కింది బస్తి తదితర ప్రాంతాల మీదుగా కొనసాగి, వివేకానంద విగ్రహం వరకు జరిగింది. ఈ రోడ్ షో ర్యాలీ లో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు, మల్లారెడ్డి అభిమానులు, స్థానిక ప్రజలు వేలాదిమంది తరలివచ్చి, ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మా అభివృద్ధి పనులే మమ్మల్ని గెలిపిస్తాయని, భారతదేశంలోనే నెం1 రాష్ట్రం మన తెలంగాణ అని, నా సహచర కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జంగయ్య యాదవ్ ను ఉద్దేశించి జంగయ్య యాదవ్ అదే వజ్రేష్ యాదవ్ అని పేరు మార్చుకోవడం హాస్యాస్పదమని.. ఏదో సభలో మల్లారెడ్డి గెలిస్తే తల నరుక్కుంటానని అన్నారని పిచ్చిగా పిచ్చిగా మాట్లాడుతూ చిన్బ పిల్లలు చేష్టలు చేయవద్దని హితవు పిలికారు. మరో కాంగ్రెస్ నాయకులు మైనంపల్లి హనుమంత్ రావ్ ను ఉద్దేశించి మైనంపల్లి కాదు మైనంపిల్లి అని ఎద్దేవా చేశారు. దొంగలు దొంగలు ఏకమై నన్ను ఓడించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, ఎన్నో ప్రజోపయోగ కార్యక్రమాలు చేశానని, సోంత ఖర్చుతో రోడ్లు వేయించాను.. ప్రజలు సేవ చేశేందుకే మరొక్కసారి అవకాశం కల్పించాలని కోరారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు