మిర్యాలగూడ : నియోజకవర్గ పరిధిలోని దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద ఆదివారం అరకిలో గంజాయి పట్టుకున్నట్లు ఎక్సైజ్సిఐ ఎల్ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. వీర్లపాలెం గ్రామంలో నివసిస్తున్న రాజ్ కుమార్ మండల్ గత కొంతకాలంగా గంజాయి విక్రయిస్తున్నాడన్న పక్క సమాచారంతో ఆదివారం తన సిబ్బందితో మెరుపు దాడి చేయడంతో అతని వద్ద ఎండిన500గ్రాముల దొరికినట్లు తెలిపారు. నిందితున్ని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ మహేశ్వర్ రెడ్డి తెలిపారు.