Wednesday, May 1, 2024

అన్నిరంగాల్లో అభివృద్ధి బీజేపీ లక్ష్యం

తప్పక చదవండి
  • నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌

నిజామాబాద్‌ : దేశం అన్నీ రంగాల్లో అభివృద్ధి చెందేలా కృషి చేయడమే బీజేపీ సంకల్పమని నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌ పేర్కొన్నారు. సిరికొండ మండలంలోని కొండాపూర్‌లో వికసిత్‌ భారత్‌సంకల్ప యాత్రలో ఆయన పాల్గొన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేనట్లు కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య బీమా పథకాన్ని అమలు చేయగా, రాష్ట్రంలో గతంలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఈ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయకుండా నిర్వీర్యం చేసిందన్నారు. అనంతరం లొంక రామలింగేశ్వర ఆలయాన్ని దర్శించుకున్నారు. జిల్లా అధ్యక్షుడు దినేశ్‌ కులాచారి, కార్యదర్శి నక్క రాజేశ్వర్‌, మండలాధ్యక్షుడు రాజేశ్వర్‌, సర్పంచ్‌ రమేశ్‌, బీసీ సెల్‌జిల్లా కార్యదర్శి రామస్వామి, ఎంపీపీ గ్దదె భూమన్న పాల్గొన్నారు. డొంకేశ్వర్‌ లోని గవర్నమెంట్‌ హైస్కూల్‌లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జరిగిన బ్యాగుల పంపిణీ కార్యక్రమంలో ఎంపీ పాల్గొన్నారు. ప్రైమరీ క్లాస్‌ స్టూడెంట్స్‌ కోసం ఐఐటీ కాన్పూర్‌ వాళ్లు ఈ బ్యాగ్‌లను ప్రత్యేకంగా డిజైన్‌ చేసినట్లు చెప్పారు.పార్లమెంట్‌పరిధిలోని స్కూళ్లలో 30 వేల మంది స్టూడెంట్స్‌కు ఈ బ్యాగులు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. డొంకేశ్వర్‌ స్కూల్‌లో ఆధునిక అటల్‌ల్యాబ్‌, ప్యూరిఫైడ్‌ వాటర్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు