Sunday, April 28, 2024

బీఆర్ఎస్, బీఎస్పీ మధ్య పొడిచిన పొత్తు

తప్పక చదవండి
  • త్వ‌ర‌లోనే పొత్తుకు సంబంధించి విధివిధానాలు
  • తెలంగాణలో ముక్కోణపు పోటీకి అవకాశం
  • నందిన‌గ‌ర్‌ కేసీఆర్ నివాసంలో ప్ర‌వీణ్ భేటీ

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్, బీఎస్పీ మధ్య పొత్తు కుదిరింది. రాష్ట్రంలోని 17 నియోజ‌క‌వ‌ర్గాల్లో బీఆర్ఎస్‌తో క‌లిసి పోటీ చేయాల‌ని బీఎస్పీ రాష్ట్ర అధ్య‌క్షుడు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ నిర్ణ‌యించారు. పొత్తు అంశంపై బీఎస్పీ రాష్ట్ర అధ్య‌క్షుడితో కేసీఆర్ నిర్ణ‌యించారు. ఈ నేపథ్యంలో పొత్తుకు సంబంధించి సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నట్లు ఇరుపార్టీల అధ్యక్షులు ప్రకటించారు. దీనికి సంబంధించి త్వరలో విధివిధానాలు ఖరారు చేయనున్నారు. మధ్యాహ్నం బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నందినగర్‌లోని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాసానికి వెళ్లి కలిశారు. ఇరువురి మధ్య లోక్ సభ ఎన్నికలు, పొత్తుల అంశంపై చర్చ జరిగింది. పొత్తుతో ముందుకు సాగాలని ఇరుపార్టీల అధ్యక్షులు నిర్ణయించారు. బీఆర్ఎస్, బీఎస్పీ పొత్తుతో ముందుకు సాగితే తెలంగాణలో లోక్ సభ ఎన్నికల్లో ముక్కోణపు పోటీ ఉండే అవకాశముంది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్-బీఎస్పీ మధ్య హోరాహోరీ పోటీ ఉండవచ్చు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు