Monday, April 29, 2024

ప్రచారంలో కాంగ్రెస్‌ దూకుడు

తప్పక చదవండి
  • 1నేడు కొత్తగూడెంలో ప్రియాంక రోడ్‌ షో

హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ప్రచారంలో జెట్‌ స్పీడ్‌తో దూసుకెళ్తుంది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన జాతీయ స్థాయి అగ్రనేతలు వరుసగా ప్రచార పర్వంలో జోరు చూపిస్తున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జన ఖర్గే, ఏఐసీసీ అగ్ర నేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ తెలంగాణలో ప్రచారం చేశారు. ప్రియాంక గాంధీ తెలంగాణలో మలివిడత ప్రచారంలో పాల్గొననున్నారు. ప్రియాంక గాంధీ ఈ నెల 24వ తేదీ నుంచి ప్రచారం చేయనున్నారు. ఈ మేరకు ప్రియాంక గాంధీ పర్యటన ఖరారయింది. ప్రియాంక గాంధీ 10 నియోజకవర్గాలల్లో ప్రచారం చేయనున్నారు. 24వ తేదీన ఉదయం 11గంటలకు పాలకుర్తిలో ప్రియాంక సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటలకు హుస్నాబాద్‌, సాయంత్రం 4గంటలకు ధర్మపురిలో సభలో ప్రసంగిస్తారు. 25వ తేదీన పాలేరు, ఖమ్మం, వైరా, మధిర నాలుగు నియోజకవర్గాలలో ప్రియాంక గాంధీ ప్రచారం చేయనున్నారు. నేడు కొత్తగూడెం రోడ్‌ షోలో ప్రియాంక గాంధీ, సీపీఐ నేత డి.రాజా పాల్గొననున్నారు. కొత్తగూడెంలో ప్రియాంక గాంధీ రోడ్‌ షోలో పాల్గొననున్నారు. కాంగ్రెస్‌ పార్టీ బలపరిచిన సీపీఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు విజయాన్ని కాంక్షిస్తూ రోడ్‌ షో, ప్రజా భేరి సభలో ప్రియాంక గాంధీ, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా పాల్గొననున్నారు. ఓల్డ్‌ డిపో నుంచి త్రీ టౌన్‌ వరకు రోడ్‌ షో నిర్వహంచనున్నారు. రేపు రాత్రి ఖమ్మంలో ప్రియాంక గాంధీ బస చేయనున్నారు. ఎల్లుండి పాలేరు, ఖమ్మం వైరా, మధిర నియోజకవర్గాలల్లో ప్రియాంక గాంధీ ప్రచారం చేయనున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు