Monday, April 29, 2024

టూవీలర్ ను ఢీకొన్న లారీ

తప్పక చదవండి
  • ఇద్దరు వ్యక్తులు దుర్మరణం

కాకినాడ : తూర్పుగోదావరి జిల్లాలోని గోపాలపురం మండలం కోమటికుంట గ్రామం వద్ద సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. బైక్‌పై ఉన్న ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు ఘటనా స్థలిలోనే మృతి చెందగా.. తీవ్రంగా గాయపడిన మరొకరిని 108 వాహనంలో గోపాలపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో వ్యక్తి కూడా మృతి చెందాడు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు