Tuesday, April 30, 2024

తెలుగు రాష్ట్రాలకు కొత్తగా 9మంది ఐపిఎస్‌లు

తప్పక చదవండి
  • తెలంగాణకు ఆరుగురు.. ఎపికి ముగ్గురు కేటాయింపు

న్యూఢిల్లీ : తెలుగు రాష్ట్రాలకు కొత్త ఐపీఎస్‌ అధికారుల్ని కేటాయిస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 9మంది అధికారులను కేటాయించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు ముగ్గురు.. తెలంగాణకు ఆరుగురిని కేటాయించింది. ఈ అధికారులంతా 2022 బ్యాచ్‌కు చెందిన వాళ్లు. తెలంగాణకు అయేషా ఫాతిమా, మంధారే సోహం సునీల్‌, సాయి కిరణ్‌, మనన్‌ భట్‌, రాహుల్‌ కాంత్‌, రుత్విక్‌ సాయిని కేటాయించారు. ఇటీవల ఢిల్లీ పర్యటనలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను కలిసిన సీఎం రేవంత్‌ రెడ్డి అదనంగా ఐపీఎస్‌ అధికారులను కేటాయించాలని విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆరుగురిని కేటాయించారు. ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన అధికారుల పేర్లపై స్పష్టత రావాల్సి ఉంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు