- నేడే నీలం మధు ముదిరాజ్ పాదయాత్ర ప్రారంభం..
- తొలిరోజు షెడ్యూల్ విడుదల..
- వివరాలు తెలిపిన టీమ్ ఎన్.ఎం.ఆర్.
హైదరాబాద్ : ఇటీవల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన అంశం నీలం మధు ముదిరాజ్ కి బీ.ఆర్.ఎస్. బాస్ టికెట్ కేటాయించక పోవడం.. ఇప్పటి వరకు వేచి చూసిన నీలం మధు.. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలబడాలని నిర్ణయించుకున్నారు.. ఇటు కాంగ్రెస్ నుంచి, అటు బీజేపీ నుంచి ఆహ్వానం అందుతుందేమో అని చూశారు కానీ ఎలాంటి ఫలితం లేకపోయింది.ఈ నేపథ్యంలో పఠాన్చెరు మీ కొడుకు నియోజకవర్గం వ్యాప్తంగా నీలం మధుకు అంతులేని ఆదరణ లభించడం కూడా చూశాం.. ఈ క్రమంలోనే నీలం మధు ఇండిపెండెంట్ గా బరిలో దిగాలని నిశ్చయించుకున్నారు.. బీ.ఆర్.ఎస్. పార్టీకి రాజీనామా చేసినట్లు కూడా తెలుస్తోంది..
మీ కొడుకు మీ ఇంటి గుమ్మంలో అనే నినాదం ఎత్తుకుని నియోజక వర్గం వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించి ప్రతి గడపను తడుతూ మద్దతును కూడగట్టుకుంటామని గతంలోనే నీలం మధు తెలిపారు.. ఆకోవలోనే ఈరోజు నుంచి పాదయాత్ర మొదలు కాబోతోంది.. ఆవివరాలు ఎన్.ఎం.ఆర్. టీమ్ సభ్యులు తెలియజేశారు..
నేటి షెడ్యూల్ :
ఉదయం 7 గంటలకు కొత్తపల్లి.. 10 గంటలకు కొత్తపల్లి తాండా.. ఉదయం 11 గంటలకు లక్ష్మాపూర్.. 11గంటల 30 నిమిషాలకు లక్ష్మాపూర్ తండా.. మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు నాగిరెడ్డి గూడెం.. మధ్యాహ్నం 3 గంటలకు ప్యారా నగర్.. సాయంత్రం 4 గంటలకు మంబాపూర్ గ్రామం.. సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు వల్లపల్లి గ్రామం..