Sunday, May 12, 2024

ఓటు వేసేందుకు వచ్చి ప్రాణాలు కోల్పోయిన ఇద్ద‌రు వృద్ధులు

తప్పక చదవండి

ఆదిలాబాద్ : ఆదిలాబాద్ ప‌ట్ట‌ణంలో ఓటు హ‌క్కు వినియోగించుకునేందుకు వ‌చ్చిన ఇద్ద‌రు వృద్ధులు అస్వ‌స్ధ‌త‌కు గురై మ‌ర‌ణించారు. మావ‌ల గ్రామానికి చెందిన తోక‌ల గంగ‌మ్మ అనే వృద్ధురాలు (76) పోలింగ్ కేంద్రానికి చేరుకునేలోగా ఫిట్స్‌తో ప‌డిపోయింది. దీంతో ఆమెను రిమ్స్‌కు త‌ర‌లించ‌గా అప్ప‌టికే మ‌ర‌ణించింద‌ని వైద్యులు నిర్ధారించారు.
ఇక భుక్తాపూర్‌కు చెందిన రాజ‌న్న‌ (65) ఓటు వేసేందుకు క్యూలో నిల్చున్నాడు. ఆపై కండ్లు తిరిగి ప‌డిపోవ‌డంతో ఆయ‌న‌ను కూడా నిమ్స్‌కు తీసుకువెళ్లారు. అక్క‌డ చికిత్స పొందుతూ రాజ‌న్న ప్రాణాలు కోల్పోయారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు