Monday, April 29, 2024

హాట్ సీట్ గా టీఎస్పీయస్సీ ఛైర్మన్‌ పదవి..?

తప్పక చదవండి
  • బాధ్యతలు చేపట్టేందుకు జంకుతోన్న అధికారులు
  • చైర్మన్ జనార్ధన్ రెడ్డితో సహా ముగ్గురు సభ్యులు రాజీనామా
  • మరో ఇద్దరు సభ్యులు మాత్రం రాజీనామా చేయలేదు
  • గవర్నర్ వద్దే పెండింగ్ లోనే రాజీనామాలు
  • రాజీనామాలు ఆమోదం పొందితేనే కొత్త బోర్డుకు అవకాశం
  • ప్రభుత్వానికి తలనొప్పిగా మారిన టీఎస్‌పీఎస్‌సీ వ్యవహారం

హైదరాబాద్ : తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత పలు పోస్టింగ్‌లు, బదీలీలతో మార్పులు చకాచకా చోటు చేసుకుంటున్నాయి. గతంలో నామినేటేడ్ పదవుల్లో ఉన్నవారు రాజీనామా చేయగా..పలు ప్రభుత్వ శాఖల అధికారుల ట్రాన్స్‌ఫర్లను ఒక పద్దతి ప్రకారంగా సర్కారు చేస్తూ వస్తోంది. అన్నింట పరిస్థితి బాగానే ఉన్న ఒక్క చోట మాత్రం పదవి స్వీకరించేందుకు ఎవరు ముందుకు రావడం లేదని గట్టిగా వినిపిస్తోంది.. ఒకరకంగా చెప్పాలంటే గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు రావడానికి ఆ విభాగమే కారణమన్న వాదన కొట్టిపారేయలేమన్న వాదన కూడా వినిపిస్తోంది. మరోవైపు బండెడు సవాళ్లతో స్వాగతం పలికే ఆ ముళ్ల కుర్చీపై కుర్చొనే సాహసమా! అంటూ పలువురు రిటైర్డ్ ఆఫీసర్లు, విద్యావంతులు వెనకడుగు వేస్తున్నట్లు సమాచారం . అదే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ పదవి.

పేపర్ లీకేజీలతో వార్తల్లోకి ఎక్కి గతంలో నిరుద్యోగుల పాలిట విలన్ గా మారిన టీఎస్‌పీఎస్‌సీ ప్రక్షాళనకు కొత్త సర్కారు నడుం బిగించింది. చైర్మన్ సహా కమిషన్ సభ్యులను రాజీనామా చేయాలని సూచించగా చైర్మన్ జనార్ధన్ రెడ్డి సహా ముగ్గురు సభ్యులు రాజీనామా చేశారు. మరో ఇద్దరు సభ్యులు మాత్రం రాజీనామా చేయలేదు. చేసిన రాజీనామాలను కూడా గవర్నర్ వద్దే ఇంకా పెండింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. వీటికి ఆమోదం పొందితేనే గాని కొత్త బోర్డు ఏర్పాటుకు మార్గం సుగమం కాదని తెలుస్తోంది.. ఇప్పుడు ప్రభుత్వానికి ఇదే తలనొప్పిగా మారింది. నిరుద్యోగులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న వేళ వాళ్లని ఏమాత్రం నిరాశ పరిచిన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం బలంగా నమ్ముతోంది. అందుకే ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తోంది.

- Advertisement -

ఇప్పటికే టీఎస్‌పీఎస్‌సీ నుంచి వెలువడిన పలు నోటిఫికేషన్లకు పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అయితే వాటిని బోర్డు ప్రక్షాళన తర్వాతే నిర్వహించే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలో జనవరి 6,7న జరగాల్సిన గ్రూప్ -2 పరీక్షపై కూడా సందిగ్ధత వీడటం లేదు. సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ కు ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడంతో పరీక్షల వాయిదా అనివార్యంగా కనిపిస్తోంది. మరోవైపు 5 లక్షల మంది అభ్యర్థులు బోర్డు ప్రకటన కోసం ఎదరుచూస్తున్నారు. దీనిపై ప్రభుత్వం కానీ, టీఎస్‌పీఎస్‌సీ అధికారులు కానీ ఇంతవరకు నోరువిప్పడం లేదు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు