లక్నో : ఉత్తరప్రదేశ్లో ఓ మహిళ తన పెంపుడు కుక్క తొమ్మిది పిల్లలకు జన్మనివ్వడంతో ఆనందంలో తేలిపోయింది. ఆ సంతోషంలో 400 మందికి విందు ఇచ్చింది. హామిర్పుర్లోని మేరాపుర్కు చెందిన రాజ్కాళి అనే మహిళ ’చట్నీ’ అనే కుక్కను కొంతకాలంగా పెంచుకుంటోంది. ఆ కుక్క ఇటీవలే 9 పిల్లలకు జన్మనిచ్చింది. ఈ క్రమంలో గ్రామస్థులు, బంధువు లకు రాజ్కాళి బుధవారం విందును ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా కుక్క పిల్లలను అందంగా అలకరించింది.