Thursday, May 2, 2024

రుషికొండపై హైకోర్టును ఆశ్రయించాలని సుప్రీం కోర్టు సూచన

తప్పక చదవండి

న్యూఢిల్లీ : రుషికొండపై హైకోర్టును ఆశ్రయించాలని సుప్రీం కోర్టు తేల్చిచెప్పింది. రుషికొండపై అక్రమ నిర్మాణాలు, జగన్‌ క్యాంపు ఆఫీస్‌ ఏర్పాటుకు వ్యతిరేకంగా దాఖలైన పిటీషన్‌పై (శుక్రవారం) సుప్రీంలో విచారణ జరిగింది. ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. హైకోర్టులో రుషికొండ కేసు పెండింగ్ లో ఉన్నందున అక్కడే పిల్‌ దాఖలు చేయాలని సుప్రీం ధర్మాసనం వెల్లడిరచారు. పిటీషన్‌ రాజకీయ ప్రేరేపితంగా ఉందని సుప్రీం పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై సుప్రీంకోర్టులో విజయవాడకు చెందిన పర్యావరణ వేత్త లింగమనేని శివరామ ప్రసాద్‌ పిల్‌ దాఖలు చేశారు. కోస్టల్‌ రెగ్యులేటరీ జోనుకు సంబంధించి నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌లో ఫైనల్‌ హియరింగ్‌ ఉండగా, నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఆదేశాలు, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించి విశాఖపట్నం రుషి కొండ విూద ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం, సీనియర్‌ అధికారుల కార్యాలయాల ఏర్పాటు కోసం ఏపీ సర్కార్‌ అక్టోబర్‌ 11, 2023న ఇచ్చిన జీవో 2015ను వెంటనే రద్దు చేయాలనీ కోరుతూ సుప్రీమ్‌ కోర్టులో లింగమనేని శివరామ ప్రసాద్‌ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21, 48/ఏ ఉల్లంఘనలకు పాల్పడిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ చర్యలను వెంటనే నిలువరించాలని పిటేషన్‌లో విజ్ఞప్తి చేశారు. ఎన్జీటీ, ఏపీ హైకోర్టులో ఈ విషయంపై ఉన్న కేసులు పరిష్కారం అయ్యే వరకు రుషికొండపై ఏ విధమైన నిర్మాణాలు, ప్రారంభ కార్యక్రమాలు జరుగకుండా వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలని లింగమనేని శివరామ ప్రసాద్‌ విజ్ఞప్తి చేశారు. పిటిషన్‌ను విచారించిన సుప్రీం కోర్టు.. హైకోర్టులో రుషికొండ కేసు పెండిరగ్‌లో ఉన్నందున అక్కడే పిల్‌ దాఖలు చేయాలని సుప్రీం ధర్మాసనం స్పందించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు