Monday, April 29, 2024

హైదరాబాద్ చేరుకున్న సోనియాగాంధీ

తప్పక చదవండి
  • ప్రత్యేక విమానంలో సోనియా, రాహుల్, ప్రియాంక
  • నేటి మధ్యాహ్నం రేవంత్ ప్రమాణ స్వీకారం

తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మరో మూడు గంటల్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరగనున్న ఈ వేడుకలో పాల్గొనేందుకు ఢిల్లీ నుంచి ఆ పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ ఈ ఉదయం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్నారు. రేవంత్‌రెడ్డి వారికి స్వాగతం పలికారు. వీరికి పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా రేవంత్ స్వయంగా పలువురు అగ్రనేతలను ఆహ్వానించారు. పక్క రాష్ట్రాల సీఎంలు, పలువురు ప్రముఖులు కూడా ఈ వేడుకకు హాజరవుతున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు కూడా వేడుకకు హాజరయ్యే అవకాశం ఉంది. ప్రమాణ స్వీకారం నేపథ్యంలో ఎల్బీ స్టేడియం చుట్టుపక్కల పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు