Tuesday, May 7, 2024

ఎన్నికల వేళ భారీగా సొత్తు సీజ్‌

తప్పక చదవండి

న్యూఢిల్లీ : అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న మధ్యప్రదేశ్‌, రాజస్తాన్‌, తెలం గాణ, ఛత్తీస్‌గఢ్‌, మిజోరంలలో లెక్కల్లో చూపించని నగదు భారీగా పట్టుబడుతున్నట్లు ఆదాయ ప న్ను విభాగం సీబీడీటీ (సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ ట్యాక్సెస్‌)తెలిపింది. ఆయా రాష్టాల్లో 2019లో జ రిగిన లోక్‌సభ లేదా అసెంబ్లీ ఎన్నికల సమయంలో కంటే చాలా ఎక్కువగా ఉన్నట్లు సీబీడీటీ చైర్మన్‌ నితిన్‌ గుప్తా తెలిపారు. సోదా, నిఘా చర్యలను ఎన్నికల కమిషన్‌ సమన్వయంతో చేపడుతున్నా మని వివరించారు. అసెంబ్లీ ఎన్నికలున్న రాజస్తాన్‌లో పట్టుబడిన అక్రమ నగదు, మద్యం, డ్రగ్స్‌, బంగారం, వెండి తదితరాల మొత్తం విలువ మూడిరతలయిందన్నారు. 2021లో సీజ్‌ చేసిన మొత్తం సొత్తు విలువ రూ.322 కోట్లు కాగా, 2022లో అది రూ.322 కోట్లకు, ఈ ఏడాదిలో ఇప్పటి వరకు రూ.1,021 కోట్లకు పెరిగిందని గుప్తా పేర్కొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు