- ‘గ్యాలక్సీ ఏఐ ఎస్-24’ సిరీస్ విడుదల
- వీఐపీ కస్టమర్లకు అత్యాధునిక ఏఐ ఫోన్ల అందజేత..
హైదరాబాద్ : పంజగుట్టలోని సమీర్ కమ్యూనికేషన్స్లో బుధవారం సాంసంగ్ కంపెనీ కొత్తగా రూపొందించిన ‘గ్యాలక్సీ ఏఐ ఎస్-24’ సిరీస్ మొబైల్ ఫోన్లను లాంచ్ చేశారు. సాంసంగ్ రీజనల్ టీం ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించిన కార్యక్రమంలో ముందుగా బుక్ చేసుకున్న వీఐపీ కస్టమర్లకు ‘గ్యాలక్సీ ఏఐ ఎస్-24’ హ్యాండ్సెట్లను అందించారు. అత్యాధునిక ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లతో కూడిన ఈ మొబైల్ను అందుకున్న వారిలో సినీ దర్శకులు, నిర్మాతలు, కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులు, ఉన్నతాధికారులు, ఇతర ప్రీమియం కస్టమర్లు ఉన్నట్లు కంపెనీ ప్రతినిధులు వెల్లడిరచారు. ఈకార్యక్రమంలో సాంసంగ్ రీజనల్ సేల్స్ మేనేజర్ సుమిత్ కుక్రేజా, రీజనల్ డిస్ట్రిబ్యూషన్ మేనేజర్ ఎస్కె నాగూర్ మౌలా, రీజనల్ మార్కెటింగ్ మేనేజర్ సౌరభ్ నాయక్, జోనల్ సేల్స్ మేనేజర్ సచిన్ జైన్, ఏబీఎం సుధీర్ తదితరులు పాల్గొన్నారు.