Monday, May 6, 2024

శాం పిట్రోడా నాకు రోల్ మోడల్

తప్పక చదవండి
  • ఆయన రాసిన రీడిజైన్ ద వరల్డ్ పుస్తకాన్ని ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం
  • కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో మనం ఇంకా వెనుకబడే ఉన్నాం
  • ప్రపంచంలో ప్రజాస్వామ్యం అనేక సమస్యలను ఎదుర్కొంటున్నదన్న బట్టి
  • ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల ఆకాంక్షలను కాంగ్రెస్ నెరవేరుస్తందని హామీ

హైదరాబాద్ : టెలి కమ్యూనికేషన్ విప్లవానికి నాంది పలికిన ప్రముఖ రచయిత శ్యామ్ పిట్రోడా తనకు రోల్ మోడల్ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. హోటల్ తాజ్ కృష్ణలో ప్రముఖ రచయిత శ్యామ్ పిట్రోడా రచన చేసిన రీ డిజైన్ ద వరల్డ్ తెలుగులో అనువాదం చేసిన “ప్రపంచానికి కొత్త రూపం ఇద్దాం కదలిరండి” అనే పుస్తకాన్ని మాజీ కేంద్ర మంత్రి ఎం.ఎం పల్లంరాజు, మాజీ పార్లమెంటు సభ్యులు మధుయాష్కి గౌడ్, ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు తో కలిసి డిప్యూటీ సీఎం ఆవిష్కరించారు. అనంతరం భట్టి మాట్లాడుతూ.. ప్రముఖ రచయిత శ్యామ్ పిట్రోడా రచన చేసిన “ప్రపంచానికి కొత్త రూపం ఇద్దాం కదలిరండి ” అనే పుస్తకం దేశంతో పాటు సమాజాన్ని మార్చి వేస్తుందన్న నమ్మకం తనకు ఉన్నదని పేర్కొన్నారు.. ప్రపంచంలో ప్రజాస్వామ్యం అనేక సమస్యలను ఎదుర్కొంటున్నదని అన్నారు. అసమానతలు పెరగడం సమాజానికి హానికరమని రచయిత ఈ పుస్తకంలో చాలా విశ్లేషణాత్మకంగా పొందుపరిచారని వివరించారు. సమాజ హితం కోసం వారు చేస్తున్న రచనలు చాలా స్ఫూర్తిదాయకం చైతన్యవంత మైనవని డిప్యూటీ సీఎం వివరించారు.

కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో మనం ఇంకా వెనుకబడే ఉన్నాం ..
కొట్లాడి కోరి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో గత పది సంవత్సరాలుగా ప్రజల ఆశలు ఆకాంక్షలు కలలు నెరవేరలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. . ఇందిరమ్మ రాజ్యంలో తెలంగాణ ప్రజలు కోరుకున్న కలలు ఆశలు నెరవేర్చడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ ప్రజల కలలు ఆశలు నెరవేర్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేసే ప్రయత్నానికి సాంకేతికంగా, మేధో పరంగా మద్దతు సహకారం అందించడానికి తెలంగాణకు రావలసిందిగా శామ్ పిట్రోడాకు విజ్ఞప్తి చేశారు. మనందరి ప్రియతమ నాయకులు దివంగత ప్రధాని రాహుల్ గాంధీ ఈ దేశంలో టెలి కమ్యూనికేషన్ రంగాన్ని తీసుకువచ్చేందుకు అమెరికాలో ఉన్న శ్యామ్ పిట్రోడా మేధస్సును గుర్తించి అడ్వైజర్ గా సేవలు తీసుకున్నారని అన్నారు. మనుషుల మధ్య ఉన్న దూరాన్ని చాలా దగ్గరగా తీసుకురావడానికి టెలి కమ్యూనికేషన్ ద్వారా భారీ విప్లవాన్ని శ్యామ్ పిట్రోడా తీసుకొచ్చారనిబట్టి ఈ సందర్భంగా గుర్తు చేశారు..

- Advertisement -

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థిగా చదువుతున్న సమయంలో తన ఇంటికి ఫోన్ చేయడానికి జనరల్ పోస్ట్ ఆఫీస్ లో ట్రంక్ కాల్ బుక్ చేసి గంటల తరబడి నిరీక్షించి ఫోన్ చేసి మాట్లాడే రోజులను బట్టి గుర్తుచేసుకున్నారు. ఫోన్ చేయడానికి గంటల తరబడి నిరీక్షించే పరిస్థితి నుంచి ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఎవరితోనైనా క్షణాల్లో ఫోన్ చేసి మాట్లాడే సౌకర్యం ఇప్పుడు వచ్చిందంటే శామ్ పిట్రోడా చేసిన కృషి అని చెప్పక తప్పదన్నారు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పార్టీకి సంబంధించిన అనుబంధ సంఘాల కమిటీలకు ఇన్చార్జిగా కొనసాగిన క్రమంలో అమెరికాలోని 20 నగరాల్లో ఎన్ఆర్ఐ సెల్ కమిటీలు వేశానని చెప్పారు. ఈ క్రమంలో చికాగో నగరంలో కూడా ఎన్నారై సెల్ కమిటీ వేయడానికి వెళ్ళిన కార్యక్రమానికి శ్యామ్ పిట్రోడా హాజరు అయ్యారని ఆయనతో ఉన్న అనుబంధాన్ని సందర్భంగా బట్టి గుర్తు చేసుకున్నారు..

క్వాడ్ జెన్ వైర్ లెస్ సొల్యుషన్స్ చైర్మన్ సీఎస్ రావు మాట్లాడుతూ,
‘రీడిజైన్ ది వరల్డ్’ పుస్తకం ప్రపంచ క్రమం ఎలా, ఎందుకు మారాలి, హైపర్ కనెక్టివిటీ ప్రపంచాన్ని ఎలా మార్చగలదో సూచిస్తుందని తెలిపారు. ఈ తెలుగు అనువాదాన్ని పి.ఎన్.రావు తన అద్భుతమైన కృషితో, హైదరాబాదుకు చెందిన ఎమెస్కో ప్రచురణ సంస్థ సహకారంతో చేశారని అన్నారు . ఇది ప్రజాదరణ పొందిన పుస్తకంగా మారుతుందని ఆశిస్తున్నానని సీఎస్ రావు పేర్కొన్నారు. ప్రపంచ నిర్మాణం గురించి, భారతదేశ ఎదుగుదలపై దాని ప్రభావం గురించి రాసిన ఈ తెలుగు అనువాదాన్ని నిజమైన ఆందోళనలను చూపిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు మాట్లాడే ప్రజలు మనమంతా చదవడానికి అర్హమైనదని ” అన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు