- మూడు నెలల్లో మణికొండలో వంద పడకల హాస్పిటల్ మంజూరు..
- మోసపోయామా గోస పాడుతాం… హరీష్ రావు..
మణికొండ : కాంగ్రెస్ మాయా మాటలను నమ్మి మీరు ఓటు వేశారా తెలంగాణ మరో పదేళ్లు వెనకకు పోతుందని హరీష్ రావు అన్నారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజేంద్రనగర్ నియోజకవర్గం లోని మణికొండ మున్సిపల్ లో బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రకాష్ గౌడ్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా మంత్రి హరీష్ రావు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 9 సంవత్సరాలలో తెలంగాణను బిఆర్ఎస్ పార్టీ ఎంత అభివృద్ధి చేసిందో పేదలకు సంక్షేమ పథకాలతో ఎంత దగ్గర అయిందో మీ అందరికీ తెలుసు అని అన్నారు. ఇప్పుడేదో దేశం నలు మూలల నుంచి ఢల్లీి నుంచి బిజెపి అని, కాంగ్రెస్ అని వస్తున్న నాయకుల మాటలు నమ్మి వారి చేతిలో మన తెలంగాణను పెట్టామంటే మళ్ళీ మన బతుకులు ఆగమయితాయని వారి మాటలను, వారి పథకాలను నమ్మి ఓటు వేయకుండా జాగ్రత్త పడాలని అన్నారు. వారివి మాటలే తప్ప చేతలు ఉండవని వారు తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత హైదరాబాద్ లో కరెంటు, నీరు, పరిశ్రమలకు ఎలాంటి లోపాలు లేవని అన్నారు. 9 సంవత్సరాల నుండి ఇంత చేసామంటే రాను రాను తెలంగాణ దేశంలో ఎంతో అత్యున్నత ఎత్తుకు ఎదుగుతుంది అనడంలో ఆశ్చర్యం లేదన్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం నుండి ప్రకాష్ గౌడ్ని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే మణికొండ మున్సిపల్ లోని వంద పడకల హాస్పటల్ గెలిచిన తర్వాత మూడు నెలల్లో మంజూరు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. కాంగ్రెస్ వాడు చెప్పే ఆరు గ్యారెంటీలు ఏమో కానీ ఒక్కటి కూడా అమలు చేసే దిక్కు వాళ్లకు లేదని తెలిపారు. మాయ మాటలు నమ్మి మోసపోయామా గోసపడతామని అన్నారు. కావున ప్రతి ఒక్కరు 30వ తారీకు కారు గుర్తుకు ఓటు వేసి మిగతా పార్టీలకు బుద్ధి చెప్పాలని ఇంకా మూడు రోజులు వీళ్ళని భరిస్తే చాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మణికొండ మున్సిపల్ బిఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ రామకృష్ణారెడ్డి, అధ్యక్షులు బుద్దోలు శ్రీరాములు, మహిళా అధ్యక్షురాలు రూపా రెడ్డి, మైనారిటీ ప్రెసిడెంట్ బషీర్తో పాటు కౌన్సిలర్, నాయకులు, కార్యకర్తలు, స్థానికులు తదితరులు వేల సంఖ్యలో పాల్గొన్నారు.