- సీఎంగా కాకుండా ముఠా నాయకుడిలా మాట్లాడుతున్నాడు
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గా కాకుండా ముఠా నాయకుడిలా మాట్లాడుతున్నాడని భారత రాష్ట్ర సమితి పార్టీ స్పోక్స్ పర్సన్ డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్ మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆరు గ్యారెంటీల పేరుతో అమలు చేయకుండా దరఖాస్తుల పేరుతో దగా చేస్తున్నారంటూ ఆరోపించారు. వ్యక్తిగత విమర్శలతో కాలం వెళ్ల బుచ్చేందుకు ప్రజలు ఓట్లు వేసి అధికారం అప్పగించ లేదని తెలుసుకుంటే డాక్టర్ శ్రవణ్ మంచిదన్నారు. అత్యాధునిక వసతి సౌకర్యాలతో ప్రగతి భవన్ ఉన్నా ఎందుకని సీఎం క్యాంపు ఆఫీసు కోసం ఎంసీహెచ్ఆర్డీకి వెందుకు వెళ్లాలని అనుకుంటున్నారో రాష్ట్ర ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యమంత్రి పదవికి ఉన్న విలువ ఏమిటో రేవంత్ రెడ్డి అర్థం చేసుకోవడం లేదని ఎద్దేవా చేశారు. ఒకప్పుడు పెయింటర్ గా ఉన్న రేవంత్ రెడ్డి ఇవాళ కోట్ల రూపాయలు ఎలా సంపాదించాడో ప్రజలకు చెప్పాలని సవాల్ విసిరారు డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్ ఆచారి. ఆరు గ్యారెంటీల అమలుకు సంబంధించి దరఖాస్తుల పేరుతో నాన్చడం తప్పితే ఇంకేమీ లేదన్నారు. ప్రభుత్వ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నప్పుడు రాజకీయ ఉపన్యాసాలు ఇవ్వడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. ఇకనైనా మాను కోవాలని సూచించారు.