- 80 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న ఎస్ఓటీ బృందం
- విశాఖపట్నం నుండి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు
- ఇద్దరు నిందితుల అరెస్ట్… పరారీలో మరో ఇద్దరు
తెలంగాణ పోలీసులు డ్రగ్స్, గంజాయి అమ్మకాలు, విక్రయాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. కొత్త సంవత్సరం వేడుకల ముందు పలుచోట్ల భారీగా గంజాయి పట్టుబడుతోంది. తాజాగా రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో 80 కేజీల గంజాయిని ఎస్ఓటీ బృందం స్వాధీనం చేసుకుంది.. విశాఖ నుంచి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు తరలిస్తుండగా ఎస్వోటీ బృందం పట్టుకుంది. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి కారును సీజ్ చేశారు. మరో ఇద్దరు నిందితులు పరారయ్యారు. కారు వెనుక భాగంలో గంజాయి దాచి పెట్టి తరలించాలని ప్లాన్ వేశారు. పోలీసులకు ఏమాత్రం అనుమానం రాకుండా కారులో ప్రతేకంగా ఓ స్థావరాన్ని నిందితులు ఏర్పాటు చేసుకున్నారు. పోలీస్ చెక్ పోస్ట్ లేని మార్గాల ద్వారా హైదరాబాద్కు గంజాయిని తరలించారని పోలీసులు వెల్లడించారు. పరారైన నిందితుల కోసం గాలిస్తున్నామని తెలిపారు.