Sunday, May 5, 2024

అదానీపై మరోసారి ఆరోపణాస్త్రాలు సంధించిన రాహుల్‌

తప్పక చదవండి

న్యూఢిల్లీ : అదానీ గ్రూప్‌ విూద కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ మరోసారి ఆరోపణలు ఎక్కుపెట్టారు. బొగ్గు దిగుమతులను విపరీతంగా పెంచి చూపడం ద్వారా ప్రజల నుంచి అదానీ గ్రూప్‌ ఏకంగా రూ.12 వేల కోట్లు దోచుకుందని తాజాగా ఆరోపించారు. ఈ మేరకు పలు విూడియా రిపోర్టులను విలేకరుల ముందు ప్రదర్శించారు. ప్రధాని నరేంద్ర మోడీ దీనిపై తక్షణం విచారణకు ఆదేశించి తన నిర్‌ద్‌భ్ఘోత్వాన్ని రుజువు చేసుకోవాలని సవాల్‌ విసిరారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో నెగ్గి కాంగ్రెస్‌ అధికారంలోకి ఈ ఉదంతంపై సమగ్ర విచారణకు ఆదేశిస్తుందని ప్రకటిం చారు. దీనిపై మోడీ మౌనమెందుకని ప్రశ్నించారు. విచారణకు ఆదేశించి తన విశ్వసనీయతను నిరూపించుకోవచ్చు కదా అని నిలదీశారు. ‘అదానీ ఇండొనేసియాలో కొనుగోలుచేసిన బొగ్గు ధర భారత్‌కు వచ్చేసరికి రెట్టింపు అవుతోంది! ఈ అడ్డగోలు పెంపు కారణంగా భారత్‌లో కరెంట్‌ చార్జీలు పెరిగాయి. వినియోగదారుల జేబుకు చిల్లు పడుతోంది. కాంగ్రెస్‌ పాలిత రాష్టాల్రపై సబ్సిడీ భారం పెరిగింది’ అని రాహుల్‌ ఆరోపించారు. ఇలాంటివి ఇంకే దేశంలో జరిగినా ప్రభుత్వాలే పడిపోయే వని ఆయన వ్యాఖ్యానించారు. కానీ మన దగ్గర ఇంత జరిగినా కనీస చర్యలు లేదని ఆరోపించారు. .‘ఒకే ఒక్క వ్యక్తి చేస్తున్న ఈ దారుణ దోపిడీని ప్రధాని చూసీచూడనట్టు పోతున్నారు. ఆయనను పదేపదే కాపాడుతున్నారు’ అని రాహుల్‌ మండిపడ్డారు. మరోవైపు, గాందీల కుటుంబమే అవినీతిలో కూరుకుపోయిందని బీజేపీ విమర్శించింది. వారిపై అవినీతి కేసులున్నాయని బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్‌ అన్నారు. అదానీ అంశం సుప్రీంకోర్టులో ఉన్నా రాహుల్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటే ఆయనకు కోర్టు విూద గౌరవం లేదని స్పష్టమ వుతోందన్నారు. ‘రాహులే నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో బెయిల్‌ విూద ఉన్నారు. వారిది ప్రపంచంలో కెల్లా అత్యంత అవినీతిమయమైన కుటుంబం’ అంటూ మండిపడ్డారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు