- వరుస కథనాలకు రాష్ట్ర సర్కార్ స్పందన
- మైనార్టీ గురుకుల కార్యదర్శి షఫీ ఉల్లా బదిలీ
- రింగ్ మాస్టర్ లతీఫ్ పై కూడా యాక్షన్..
హైదరాబాద్ (ఆదాబ్ హైదరాబాద్) : తెలంగాణ మైనార్టీ గురుకుల సోసైటీల్లో జరుగు తున్న అక్రమాలపై ఆదాబ్ రాసిన వరుస కథనాలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఈ మేరకు రాష్ట్ర మైనార్టీ గురుకుల సోసైటీల కార్యదర్శి షఫీఉల్లాను తొలగిస్తూ..ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనతో పాటు స్టేట్ ఆఫీసులో అకడమిక్ హెడ్ తో పాటు ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ అధికారిగా ఉన్న రింగ్ మాస్టర్ లతీఫ్ పై యాక్షన్ తీసుకుంది. లతీఫ్ ను ఆదిలాబాద్ జిల్లా ఇంఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించింది. అంతేకాక ఆయనను త్వరలోనే అకడమిక్ హెడ్ బాధ్యతల నుంచి కూడా తొలగించే అవకాశాలున్నట్లు రాష్ట్ర మైనార్టీ గురుకుల కార్యాలయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.