Friday, May 10, 2024

బీఆర్‌ఎస్‌కు రూ.683 కోట్లు విరాళాలు

తప్పక చదవండి
  • ప్రాంతీయ పార్టీల విభాగంలో బీఆర్‌ఎస్‌ టాప్‌ ప్లేస్‌
  • బీఆర్‌ఎస్‌ పార్టీకి వారి నేతలు ఇచ్చినవే ఎక్కువ..
  • మాజీ మంత్రి మల్లారెడ్డి తరుపున రూ. 5 కోట్ల పైమాటే

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌) : బీఆర్‌ఎస్‌ పార్టీకి అందిన విరాళాల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. 2022-23 ఏడాదిలో బీఆర్‌ఎస్‌ పార్టీకి మొత్తం రూ. 683 కోట్ల విరాళాలు అందాయని పేర్కొంది.. ఎలక్ట్రోరల్‌ బాండ్స్‌ ద్వారా రూ. 529 కోట్లు, ఎల క్ట్రోరల్‌ ట్రస్ట్‌ ఫండ్‌ ద్వారా రూ. 90 కోట్లు, వ్యక్తుల ద్వారా 64 కోట్లు విరాళాలు అందాయని తెలిపింది..
ప్రాంతీయ పార్టీల విభాగంలో బీఆర్‌ఎస్‌ టాప్‌ ప్లేస్‌..
రాజకీయ పార్టీలకు ప్రతి ఏటా వివిధ రకాలుగా సమకూరే ఆదాయానికి సంబంధించి ప్రాంతీయ పార్టీల విభాగంలో బీఆర్‌ఎస్‌ టాప్‌ ప్లేస్‌లో నిలిచింది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికారం కోల్పోయిన ఆ పార్టీకి 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.683 కోట్ల విరాళాలు లభించాయి. వీటిలో రూ.529 కోట్లు ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా వచ్చాయి. అంతకుముందు ఏడాది బీఆర్‌ఎస్‌ పార్టీకి రూ.193 కోట్ల విరాళాలు రాగా, వాటిలో ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా దక్కినవి రూ.153 కోట్లు మాత్రమే. వివిధ రాజకీయ పార్టీల ఆడిట్‌ రిపోర్టులను ఎన్నికల సంఘం (ఈసీ) విడుదల చేసింది. ఎన్నికల నేపథ్యంలో గతేడాది బీఆర్‌ఎస్‌ భారీ ఎత్తున విరాళాలు సేకరించిందని ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.


బీఆర్‌ఎస్‌ పార్టీకి వారి నేతలు ఇచ్చినవే ఎక్కువ ఉన్నాయి..
బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు, వారి సన్నిహితులు ఇచ్చినవే ఎక్కువ ఉన్నాయి. నివేదికల ప్రకారం, బీఆర్‌ఎస్‌ కరీంనగర్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌, ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ రవి చంద్ర వద్దిరాజు (గాయత్రీ గ్రానైట్స్‌), హన్సా పవర్స్‌ అండ్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్‌ కంపెనీ, రాజపుష్ప ప్రాపర్టీస్‌ ఒక్కొక్కరు రూ.10 కోట్ల చొప్పున విరాళాలు అందించారు. వ్యక్తుల నుంచి వచ్చిన రూ.64 కోట్లలో ఈ నలుగురి వాటానే రూ.40 కోట్లుగా గణంకాలు చెబుతున్నాయి.ఇక బీఆర్‌ఎస్‌ రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవికి గాయత్రి గ్రానైట్స్‌లో వాటాలు, తెలంగాణలో భూములు ఉన్నాయి. వద్దిరాజు, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ ఒకే పార్టీకి చెందిన రాజకీయ నాయకులే కాకుండా బంధువులు కూడా. హన్సా పవర్స్‌ అండ్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ మాజీ మంత్రి పువ్వాడకు సంబంధించిన కంపెనీగా తెలుస్తోంది. అందులో వారి కుటుంబ సభ్యులు డైరెక్టర్లుగా ఉన్నారు. రాజపుష్ప ప్రాపర్టీస్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ పి. వెంకట్రామారెడ్డి బంధువులకు చెందిన కంపెనీ. దీంతో మ్నెత్తం విరాళాల్లో ఈ నలుగురి వాటానే ఎక్కువగా ఉంది. ఇక మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి రూ.2.75 కోట్లు, మల్లారెడ్డి సతీమణి కల్పన పేరిట రూ.2.25 కోట్లు విరాళంగా ఇచ్చారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు