- అందరం ఒక్కటై కాంగ్రెస్ గద్దల నుంచి తెలంగాణను కాపాడుకోవాలి.
- కాంగ్రెస్ నాయకులకు ఎద్దు, వ్యవసాయం తెలియదు.
- 24 గంటల కరెంటు కావాలా? 3 గంటల కరెంటు కావాలా.?
- కోదాడలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్..
కోదాడ : ఎన్నికలు రాగానే ప్రజలు ఆగమాగం కావొద్దు. కోదాడలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని రాష్ట్ర బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. డిసెంబర్ 3న కోదాడలో బీఆర్ఎస్ జెండా ఎగరాలి అని అన్నారు.బుధవారం కోదాడ పట్టణంలో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బొల్లం మల్లయ్య యాదవ్ కు మద్దతుగా కెటిఆర్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి 11 సార్లు అధికారం ఇస్తే, 55 ఏళ్లు రాష్ట్రాన్ని చావగొట్టారని కెటిఆర్ మండిపడ్డారు.ఆ పార్టీకి మరోసారి అవకాశమిస్తే, మళ్లీ 50 ఏళ్లు వెనక్కిపోతామని హెచ్చరించారు.ఈ ఎన్నికల్లో ప్రజలెవరూ ఆగం కావొద్దని, అందరం ఒక్కటై కాంగ్రెస్ గద్దల నుంచి తెలంగాణను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.తెలంగాణ అభివృద్ధితో పాటు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే, మరోసారి కేసీఆర్ గారిని గెలిపించాలని ఓటర్లకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.అప్పుడు కోదాడ ఎలా ఉండే.? ఇప్పుడు కోదాడ ఎలా ఉంది అని ఆలోచన చెయ్యాలని అన్నారు. 24 గంటల కరెంటు కావాలా.? 3 గంటల కరెంటు ఇచ్చే కాంగ్రెస్ పాలన కావాలా.? అని ప్రశ్నించారు. ఎలక్షన్ రాగానే వాళ్ళు వీళ్ళు చెప్పేది నమ్మొద్దు, మస్పూర్తిగా ఆలోచన చేసి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బొలం మల్లయ్య యాదవ్ కి ఓటు వేయండని అభ్యర్థించారు.టీపీసీసీ అధ్యక్షుడు మూడు గంటలు పొలాలకు కరెంట్ చాలని చెబుతున్నాడని.. మరి మూడు గంటలు కరెంట్ సరిపోతుందో, లేదో చెప్పాల్సింది ప్రజలేనన్నారు. కరెంటు కావాలో కాంగ్రెస్ కావాలో తేల్చుకోవాలన్నారు.మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే పింఛన్ను రూ.5వేలకు పెంచుతామన్నారు. సౌభాగ్యలక్ష్మి పథకం కింద 18ఏళ్లు నిండిన మహిళలకు రూ.3వేలు అందించనున్నట్లు తెలిపారు. కోదాడలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బొల్లం మల్లయ్య యాదవ్ గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తే ఆయన అభ్యర్థించినటువంటి కోదాడ పట్టణంలోని రెండు పెద్ద చెరువులను మినీ ట్యాంక్ బండ్ గా ఏర్పాటు చేస్తామన్నారు. రెండు రాజధానుల మధ్యలో ఉన్న కోదాడలో హైటెక్ బస్టాండ్ ఏర్పాటు చేస్తామన్నారు. కోదాడలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్, నర్సింగ్ కాలేజీలో ఏర్పాటు చేస్తాం. కోదాడ పట్టణ అభివృద్ధికి వంద కోట్ల రూపాయల కేటాయిస్తామని హామీ ఇచ్చారు. స్పోర్ట్స్ స్టేడియం ఏర్పాటు చేస్తామని చెప్పారు. పెంట కోదాడ మాజీ ఇంచార్జ్ శశిధర్ రెడ్డి పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీగా తరలివచ్చారు.