Monday, April 29, 2024

భారతీయ జనతా పార్టీ మారే ప్రసక్తే లేదు..

తప్పక చదవండి
  • స్పష్టం చేసిన బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ..

హైదరాబాద్ : వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీలో శ్రీనివాస రెసిడెన్సి (లాడ్జ్) అండ్ రెస్టారెంట్ కి ముఖ్య అతిథులుగా విచ్చేసిన భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.., మీడియాలో తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతునట్లు వస్తున్న వార్తలను బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తీవ్రంగా ఖండించారు.. ఈ విషయంపై పత్రిక ప్రకటన విడుదల చేశారు డీకే అరుణ, తాను కాంగ్రెస్ పార్టీలో చేరే ప్రసక్తి లేదని, కావాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు మైండ్ గేమ్ ఆడుతున్నారని, బిజెపి జాతీయ నాయకత్వం తనను గుర్తించి జాతీయ ఉపాధ్యక్షురాలు పదవి ఇచ్చిందని, మోడీ నాయకత్వంలో పని చేయడానికి అదృష్టం ఉండాలని డీకే అరుణ అన్నారు. కనీసం తన స్పందన తీసుకోకుండా వార్త కథనాలు రాయడం సరైంది కాదని డీకే అరుణ మండిపడ్డారు. తన రాజకీయ భవిష్యత్ నిర్ణయించాల్సిన హక్కు మీడియాకు ఎవరు ఇచ్చారని, కాంగ్రెస్ లో తన చేరికపై దుష్ప్రచారం చేస్తున్న మీడియా సంస్థలను ఆమె ప్రశ్నించారు. తనపై దుష్ప్రచారం చేసిన మీడియా సంస్థలపై పరువు నష్టం దావా వేస్తానని డీకే అరుణ తెలిపారు. ప్రపంచ దేశాలు మోదీని గుర్తిస్తున్నారు. వారి సేవలు భారతదేశానికి చాలా అవసరం అని గమనించండి. దేశం, ధర్మం, న్యాయం, కోసం అహర్నిశలు కృషి చేస్తు అవినీతిలేని పరిపాలన అందిస్తున్న ఏకైక నాయకుడు నరేంద్రమోడీ విశ్వ విఖ్యాత మోదీ సారధ్యంలో పని చేయడం నా అదృష్టంగా భావిస్తున్నానని ఆమె తెలియజేసినారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు