Monday, April 29, 2024

మొదటి విడత ప్రచారానికి తెర

తప్పక చదవండి
  • దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల హడావుడి
  • నవంబర్ 7 వ తేదీన తొలి విడత ఎన్నికల
  • మిజోరం, ఛత్తీస్‌గఢ్‌లో పోలింగ్ కు సర్వం సిద్ధం
  • ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థుల పాట్లు

న్యూఢిల్లీ : ఐదు రాష్ట్రాల్లో జరుగుతోన్న అసెంబ్లీ ఎన్నికలను మినీ సంగ్రామంగా భావిస్తున్నారు. ఈ క్రమంలో మిజోరంలోని మొత్తం 40 అసెంబ్లీ స్థానాలతోపాటు ఛత్తీస్గఢ్లోని 20స్థానాలకు మొదట విడతలో నవంబర్ 7న పోలింగ్ జరగనుంది. ఇప్పటివరకు అన్ని పార్టీలు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేయగా.. నేటితో అక్కడ ప్రచారానికి తెర పడింది. ఇక ఈ ఎన్నికల ఫలితాలు.. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతోపాటే డిసెంబర్ 3 వ తేదీన వెలువడనున్నాయి. రెండు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 60 స్థానాల్లో పోలింగ్‌ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది.

ఛత్తీస్‌గఢ్‌లో నవంబర్ 7 వ తేదీన తొలి విడత పోలింగ్ జరగనుంది. మొత్తం 90 స్థానాలు ఉండగా.. తొలి విడతలో భాగంగా 20 స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. హోరాహోరీగా ప్రచారం చేసిన ప్రధాన పార్టీలు.. ఇక పోలింగ్‌కు సిద్ధమయ్యాయి. ఇక ఛత్తీస్‌గఢ్ తొలి విడత ప్రచారం ముగియడానికి కొన్ని గంటల ముందు కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోను విడుదల చేసింది. రైతులు, మహిళా సంఘాలకు రుణమాఫీతో పాటు సబ్సిడీపై వంట గ్యాస్‌, భూమి లేని పేదలకు ఆర్థిక సాయం వంటి హామీలను అందులో వెల్లడించింది. ఇక సీఎం భూపేశ్‌ బఘేల్‌ ప్రభుత్వంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కుంభకోణాలకు పాల్పడుతోందంటూ విరుచుకుపడ్డారు. ఇక ఛత్తీస్‌గఢ్‌లోని డోంగార్‌గఢ్‌లో ఉన్న బమ్లేశ్వరీ అమ్మవారి దేవాలయంతోపాటు చంద్రగిరిలో జైన్‌ మందిర్‌ను ప్రధాని మోదీ దర్శించుకున్నారు.

- Advertisement -

ఇక మిజోరంలో 40 అసెంబ్లీ స్థానాలున్నాయి. మొత్తం 8.57 లక్షల మంది ఓటర్లుగా నమోదై ఉన్నారు. ఈసారి మిజోరం అసెంబ్లీ ఎన్నికల బరిలో 40 స్థానాలకు గానూ మొత్తం 174 మంది అభ్యర్థులు పోటీలో నిలబడ్డారు. ప్రస్తుతం మిజోరంలో అధికారంలో ఉన్న మిజో నేషనల్‌ ఫ్రంట్‌‌తోపాటు జోరం పీపుల్స్‌ మూమెంట్‌, కాంగ్రెస్‌లు ఆ రాష్ట్రంలో ఉన్న 40 స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలోకి దింపాయి. ఇక బీజేపీ 23 మందిని, ఆమ్‌ ఆద్మీ పార్టీ నలుగురు అభ్యర్థులను పోటీలో ఉంచాయి. ఇక పార్టీలతోపాటు మరో 27 మంది అభ్యర్థులు ఇండిపెండెంట్‌గా పోటీలో చేస్తున్నారు. ఇక ఎన్నికలకు రెండు రోజులే సమయం ఉన్నందున అర్హులైన వారు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేశారు. ఈ క్రమంలోనే మిజోరంలో మొత్తం 10,585 మంది పోస్టల్ బ్యాలెట్ ఓటు వేశారని మిజోరం రాష్ట్ర ఎన్నికల అధికారులు వెల్లడించారు.

అధికారంలో ఉండి గత ఎన్నికల్లో ఓటమి పాలైన కాంగ్రెస్ పార్టీ తిరిగి మిజోరంలో ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకోవాలని తహతహలాడుతోంది. ఐదేళ్ల క్రితం చేజారిన అధికారాన్ని మళ్లీ చేజిక్కించుకోవాలని హస్తం పార్టీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ సహా కీలక నేతలందరూ మిజోరంలో ప్రచారం నిర్వహించారు. ఇక మిజోరం ఓటర్లను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా వీడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా అద్భుత మిజోరం నిర్మాణం కోసం బీజేపీ కట్టుబడి ఉందని అందులో పేర్కొన్నారు. దాని కోసం మిజోరం రాష్ట్ర ప్రజల మద్దతు బీజేపీకి లభిస్తుందని ఆశిస్తున్నానని ప్రదాని నరేంద్ర మోదీ తెలిపారు. అయితే మిజోరం ఎన్నికల ప్రచారంలో భాగంగా అక్టోబర్‌ 30 వ తేదీన ఆ రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించాల్సి ఉంది. అయితే ఆ పర్యటన ఆకస్మికంగా రద్దయ్యింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు