- మిజోరం, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో రేపు పోలింగ్
- ఛత్తీస్ఘడ్లో తొలివిడత 20 స్థానాల్లో పోలింగ్
న్యూఢిల్లీ : మిజోరం, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో తొలి విడత ఎన్నికల ప్రచారానికి తెరపడిరది. మిజోరంలోని మొత్తం 40 అసెంబ్లీ స్థానాలతోపాటు ఛత్తీస్గఢ్లోని 20స్థానాలకు మొదట విడతలో నవంబర్ 7వ తేదీ మంగళవారం పోలింగ్ జరగనుంది. మంగళవారం పోలింగ్ జరగనున్న ప్రాంతాల్లో ప్రచారానికి తెరపడిరది. నవంబర్ 7న రెండు రాష్ట్రాల్లో కలిపి మొత్తంగా 60 అసెంబ్లీ స్థానాల్లో జరగనున్న పోలింగ్కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మిజోరం అసెంబ్లీ గడువు డిసెంబర్ 17న ముగుస్తుండగా.. ఛత్తీస్గఢ్ శాసనసభ గడువు జనవరి 3, 2024తో ముగియనుంది. ఆలోపే ఈ రెండు రాష్ట్రాలతోపాటు తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఎన్నికలు పూర్తవనున్నాయి. డిసెంబర్ 3న ఐదు రాష్ట్రాల ఎన్నికల లెక్కింపు ఉంటుంది. ఛత్తీస్గఢ్లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. తొలివిడతలో నవంబర్ 7న 20 స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. మిగతా 70 స్థానాలకు నవంబర్ 17న మరోవిడతలో నిర్వహించ నున్నారు. ప్రస్తుతం జరుగుతోన్న 20 స్థానాల్లో ఎక్కువగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోనే ఉన్నాయి. దీంతో ఇక్కడ కేంద్ర ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది. తొలివిడత ఎన్నికలకు కొన్ని గంటల ముందే కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోను విడుదల చేసింది. రైతులు, మహిళా సంఘాలకు రుణమాఫీతో పాటు రాయితీపై వంటగ్యాస్, భూమిలేని పేదలకు ఆర్థిక సాయం వంటి హావిూలను గుప్పిం చింది. ఛత్తీస్గఢ్లో బీజేపీ అగ్రనాయకులు జోరుగా ప్రచారం చేశారు. ప్రధాని మోదీ ఛత్తీస్గఢ్లోని డోంగార్గఢ్లో ఉన్న బమ్లేశ్వరీ అమ్మవారి దేవాలయంతోపాటు చంద్రగిరిలో జైన్ మందిర్ను దర్శించుకు న్నారు. అక్కడ ఆచార్య శ్రీ 108 విద్యాసాగర్ జీ మహరాజ్ ఆశీస్సులు తీసుకున్నట్లు ప్రధాని మోదీ సోషల్ విూడియాలో చెప్పారు. మిజోరంలో 40 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 8.57లక్షల మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం 174 మంది ఎన్నిక బరిలో నిలిచారు. అధికార మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్ఎఫ్), జోరం పీపుల్స్ మూమెంట్, కాంగ్రెస్ పూర్తిస్థాయిలో అభ్యర్థులను రంగంలో దించాయి. బీజేపీ మాత్రం 23 మందిని, ఆమ్ ఆద్మీ పార్టీ నలుగురిని పోటీలో నిలిపాయి. మరో 27 మంది స్వతంత్ర అభ్యర్థులుగా పోటీలో ఉన్నారు. ఐదేళ్ల క్రితం చేజారిన అధికారాన్ని దక్కించుకోవాలని కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. రాహుల్ గాంధీ వంటి అగ్రనేతలు మిజోరంలో ప్రచారం చేశారు. అక్టోబర్ 30న మిజోరంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించాల్సి ఉన్నప్పటికీ ఆకస్మికంగా అది రద్దయ్యింది. మిజోరంలో పోలింగ్ విధుల్లో ఉన్న ప్రభుత్వ అధికారులకు పోస్టల్ బ్యాలెట్తోపాటు వయోవృద్ధులు, దివ్యాంగులకు ఇంటినుంచే ఓటు వేసేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. ఇలా 2 వేల 59 మంది వృద్ధులు, దివ్యాంగులు, 8 వేల 526 మంది ప్రభుత్వ ఉద్యోగులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం 10 వేల 585 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేశారు.