- ప్రచార కన్వీనర్గా నియామకం
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలో చేరిన తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్కు.. పార్టీ అధిష్ఠానం కీలక బాధ్యతలను కట్టబెట్టింది. దీంతో కాంగ్రెస్ పార్టీకి ప్రచారంలో నవీన్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. మొదట తన సొంత పార్టీ తరపున మేడ్చల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించిన మల్లన్న.. తన పార్టీ లీగల్ వ్యవహారాలు కొలిక్కి రాకపోవటంతో.. కాంగ్రెస్ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలని భావించారు. కానీ.. కాంగ్రెస్ నాయకత్వం జరిపిన చర్చల తర్వాత.. పార్టీలో అధికారికంగా చేరటమే కాకుండా.. ఆ పార్టీని గెలిపించే బాధ్యతలను కూడా తన భుజాలకు ఎత్తుకున్నారు తీన్మార్ మల్లన్న. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీపై.. కేసీఆర్ కుటుంబంలో తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించే మల్లన్నకు సోషల్ మీడియా వేదికగా మంచి ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. దీంతో.. ఆయన మాటలకు, ప్రభుత్వాన్ని నిలదీసే విధానాన్ని ఈ ఎన్నికల్లో వాడుకునేందుకు కాంగ్రెస్ పెద్ద ఎªలానే వేసింది. అయితే.. ప్రచార కమిటీ ఛైర్మన్గా ఉన్న మధుయాష్కీ గౌడ్.. ఎల్బీనగర్ బరిలో ఉండటంతో.. క్యాపెయినింగ్కు సంబంధించిన వ్యవహారాలను ఇప్పుడు మల్లన్న చూసుకోనున్నాడు. ఇప్పటికే రేవంత్ రెడ్డి మాటల తూటలతో ప్రత్యర్థులను బహిరంగ సభలలో నిలదీస్తుండగా.. ఆయనకు మల్లన్న తోడవటంతో కాంగ్రెస్ ప్రచారం మరో స్థాయికి చేరనుదని శ్రేణులు భావిస్తున్నాయి. కన్వీనర్గా నియమిస్తూ వెల్లడిరచిన ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొనగా.. ప్రచారానికి సంబంధించిన షెడ్యూల్, ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు. నామినేషన్లకు రేపు ఒక్కరోజే సమయం ఉండటంతో.. ఆ పర్వం పూర్తయిన వెంటనే ప్రచార పక్రియను వేగవంతం చేసేలా ఎªలాన్ చేయనున్నారు. ఇప్పటికే రాహుల్గాంధీ, ప్రియాంకాగాంధీ ఈ నెల 15 తర్వాత తెలంగాణపై ప్రత్యేక ఫోకస్ పెట్టి ప్రచారం చేయనున్న నేపథ్యంలో.. అటు అభ్యర్థులు, శ్రేణులతో సమన్వయం చేసుకుంటూ ప్రచారా కార్యక్రమాలను ఖరాలు చేయనున్నారు. మరోవైపు.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కొడంగల్, కామారెడ్డి స్థానాల్లో పోటీ చేస్తుండగా.. ఆ రెండిరటిపై దృష్టి పెడుతూనే మిగితా అభ్యర్థుల ప్రచారానికి కూడా హాజరవుతున్నారు. ఇక.. తీన్మార్ మల్లన్న కూడా తోడవటంతో ఆయా సభల్లో.. మల్లన్నను కూడా గట్టిగా వాడనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే.. ప్రభుత్వ వైఫల్యాలు, కేసీఆర్ కుటుంబ పాలనను తీవ్ర స్థాయిలో ఎండగడుతూ.. సోషల్ మీడియా వేదికగా తనదైన శైలిలో ముందుకెళ్తోన్న మల్లన్న.. ఇప్పుడు కూడా సర్కార్ వ్యతిరేక వర్గాన్ని కాంగ్రెస్ వైపు తిప్పుకునేందుకు వ్యూహాన్ని అమలు చేయనున్నట్టు తెలుస్తోంది. ఇటు ప్రత్యక్షంగానూ, అటు పరోక్షంగానూ ప్రచారంలో తనదైన శైలిలో స్టాటజ్రీలతో.. కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు కృషి చేయనున్నట్టు తెలుస్తోంది. అయితే.. కేసీఆర్ తిట్టటంలో రేవంత్ రెడ్డి తర్వాత మళ్లీ తీన్మార్ మల్లన్నే అన్నట్టుగా ఆయన విమర్శలు చేస్తుండగా.. ఇప్పుడు ఇద్దరు కలిసి ప్రచార బరిలోకి దిగితే.. ప్రత్యర్థులకు చింతపండే అంటూ హస్తం శ్రేణులు ఉత్సాహం వ్యక్తం చేస్తున్నారు.