Sunday, April 28, 2024

ఒకే ఒక్కడు.. !

తప్పక చదవండి
  • తెలుగు రాష్ట్రాల్లో ఆయనదే హవా..
  • స్టార్ క్యాంపెయినర్‌గా బండి సంజయ్..
  • బండిపై నమ్మకముంచిన అధిష్టానం..
  • 40 మందితో స్టార్ క్యాంపెయినర్ లిస్ట్ ప్రకటన..

న్యూ ఢిల్లీ : చత్తీస్ గఢ్ ఫేజ్-1 అసెంబ్లీ ఎన్నికలకు గాను స్టార్ క్యాంపెయినర్‌గా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ను పార్టీ జాతీయ నాయకత్వం నియమించింది. ఇక చత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో బండి సంజయ్ ప్రచారం చేయనున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, నడ్డా, అమిత్ షా సహా 40 మందితో స్టార్ క్యాంపెయినర్ జాబితాను కమలం పార్టీ గురువారం ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల నుంచి స్టార్ క్యాంపెయినర్‌గా పార్టీ నియమించిన వారిలో బండి సంజయ్ ఒక్కడికి మాత్రమే చోటు కల్పించింది.

జేపీ నడ్డా నివాసంలో బీజేపీ తెలంగాణ కోర్ గ్రూప్ నేతల సమావేశం ముగిసింది. సమావేశంలో తరుణ్ ఛుగ్, కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా, గడ్కరీ, ప్రకాష్ జవదేకర్, కిషన్ రెడ్డి, డీకే అరుణ, డా. కే. లక్ష్మణ్, బండి సంజయ్, ఈటల పాల్గొన్నారు. తెలంగాణ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేశారు. నడ్డాతో భేటీకి ముందు జవడేకర్ నివాసంలో మధ్యాహ్నం నుంచి సుదీర్ఘ మంతనాలు జరిపారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు