Tuesday, April 30, 2024

జమిలిపై 5వేల సూచనలు

తప్పక చదవండి
  • మాజీ రాష్ట్రపతి కోవింద్‌ కమిటీకి పలు సలహాలు

న్యూఢిల్లీ : మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలో ’వన్‌ నేషన్‌`వన్‌ ఎలక్షన్‌’పై ఏర్పాటైన కమిటీకి ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. ఇప్పటికే 5,000కు పైగా సూచనలు అందాయి. దేశంలో ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రస్తుతం ఉన్న చట్టపరమైన పరిపాలనా విధానంలో మార్పులు చేసేందుకు ఈ ఉన్నత స్థాయి కమిటీ గత వారం ప్రజల నుంచి సూచనలు కోరింది. ఇప్పటివరకు 5,000కు పైగా ఇమెయిల్‌లు వచ్చాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. జనవరి 15 వరకు అందిన సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని ఉన్నత స్థాయి కమిటీ బహిరంగ నోటీసులో తెలిపింది. గతేడాది సెప్టెంబర్‌లో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి రెండు సమావేశాలు జరిగాయి.ఈ కమిటీ ఇటీవల రాజకీయ పార్టీలకు లేఖలు రాసి ’పరస్పరం అంగీకరించిన తేదీ’లో ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనపై వారి అభిప్రాయాలను కూడా కోరింది. తర్వాత పార్టీలకు రిమైండర్‌ పంపింది. ఆరు జాతీయ పార్టీలు, 33 రాష్ట్ర స్థాయి పార్టీలు, ఏడు నమోదైన గుర్తింపు లేని పార్టీలకు లేఖలు పంపారు. ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడంపై లా కమిషన్‌ అభిప్రాయాలను కూడా కమిటీ స్వీకరించింది. నిబంధనల ప్రకారం రాజ్యాంగం, ఇతర చట్టబద్ధంగా ఉన్న అంశాలను దృష్టిలో ఉంచుకుని, ప్రజల సభలు, రాష్ట్ర అసెంబ్లీలు, మునిసిపాలిటీలు, పంచాయతీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం కోసం ఈ కమిటీపరిశీలించి సిఫార్సులు చేస్తుంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు