Friday, May 3, 2024

శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం..

తప్పక చదవండి
  • తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..
    కలియుగ ప్రత్యక్షదైవమైన శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు తిరుమలకు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. దీంతో తిరుమల పరిసరాల్లో భక్తుల రద్దీ పెరిగింది. స్వామివారి దర్శనానికి 29 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న స్వామివారిని 71,073 మంది భక్తులు దర్శించుకోగా 37,215 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.67 కోట్లు వచ్చిందన్నారు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు