Saturday, April 27, 2024

మంత్రి శ్రీనివాస్ గౌడ్ ని కలిసి కృతజ్ఞతలు తెలిపిన తెలంగాణ

తప్పక చదవండి

రెస్టారెంట్ అండ్ బార్ అసోషియేషన్ సభ్యులు..

హైదరాబాద్ : సోమవారం రోజు హైదరాబాదులోని మినిస్టర్స్ క్వార్టర్స్ లో రాష్ట్ర ఆబ్కారి శాఖ మంత్రివర్యులు డా: వి. శ్రీనివాస్ గౌడ్ ను తన క్యాంపు కార్యాలయంలో కలిసి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేశారు “తెలంగాణ రెస్టారెంట్ అండ్ బార్ అసోసియేషన్” వారు.. గత కొంతకాలంగా నష్టాలలో కోరుకపోయిన రెస్టారెంట్, బార్లను తెలంగాణ ప్రభుత్వం 90 ఎం.ఎల్, క్వార్టర్, హాఫ్ లు, రెంటల్స్ ను నాలుగు భాగాలుగా కట్టుకునే వెసులుబాటు, లిక్కర్ లిఫ్టింగును గతంలో ఐదు నుండి ఏడుకు పెంచడాన్ని హర్షం ప్రకటించారు.. చైర్మన్ బాలగౌని బాల్ రాజ్ గౌడ్, రాష్ట్ర అధ్యక్షులు దామోదర్ గౌడ్, గౌరవ అధ్యక్షులు గడ్డమీది విజయకుమార్ గౌడ్, ప్రధాన కార్యదర్శి జైపాల్ రెడ్డి, గౌరవ సలహాదారులు అయిలి వెంకన్న గౌడ్, ఉపాధ్యక్షులు రాజు గౌడ్, రామకృష్ణ, ట్రెజరర్ శ్రీధర్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు లక్ష్మీనారాయణ గౌడ్, నిరంజన్ గౌడ్, బత్తిని లతా గౌడ్, వివిధ జిల్లాల నుండి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.. ముఖ్యమంత్రి కేసీఆర్ కి, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది… ఇంకా కొన్ని పెండింగ్ సమస్యలపై సానుకూలంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు