- తెలంగాణ రాష్ట్రాన్ని మీకు ఎవరూ రాసిచ్చారు : భట్టి
ఖమ్మం : హరీశ్రావు ఖమ్మం నీ జాగీరు కాదు, సిఎం కెసీఆర్ది అంతకన్నా కాదు. ఇది ఎంతో చైతన్యవంతమైన జిల్లా, దొరల జిల్లా కాదు. ఇది సిద్ధిపేట కాదు. విూ ఇష్టం వచ్చినట్లు ఇక్కడి ప్రజలు, మిగతా రాజకీయ పార్టీల గురించి మాట్లాడటం సరికాదని సిఎల్పీనేత భట్టి విక్రమార్క అన్నారు. నువ్వు ప్రారంభోత్సవానికో.. శంకుస్థాపనకో వచ్చినప్పుడల్లా కాంగ్రెస్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే ఊరుకోమన్నారు. నీకు ఏంతెలుసు ఇక్కడి రాజకీయం గురించి. నీకిచ్చిన ఉద్యోగాన్ని సక్రమంగా చేసుకో..’ భట్టి విక్రమార్క వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు గురువారం తన ఖమ్మంజిల్లా పర్యటనలో కాంగ్రెస్ పార్టీపై చేసిన వ్యాఖ్యలను భట్టి విక్రమార్క తీవ్రంగా ఖండిరచారు. ఖమ్మంజిల్లా ముదిగొండ మండలం వెంకటాపురంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మాట్లాడితే 90సీట్లు తమవేనంటున్నారని, కానీ తెలంగాణ ప్రజల తీర్పు మరోలా ఉండబోతోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆసుపత్రుల్లో డాక్టర్, నర్సుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని భర్తీ చేయాలని, ఇప్పటికే ప్రజలు వైద్యసేవలకు ఇబ్బందులు పడుతున్నారన్నారు. హరీష్ తనకు ఇచ్చిన ఉద్యోగాన్ని సరిగ్గా చేయాలని, ఇష్టం వచ్చినట్లు ఆయన మాట్లాడటం సరికాదని, ఆయన వల్ల ఖమ్మం జిల్లా ప్రజలకు ఒరిగిందేవిూ లేదని విమర్శించారు. తెలంగాణ ప్రజలు పోరాడి సాధించుకున్న ప్రజాస్వామ్య రాష్ట్రమని, ఎవరి ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సబబు కాదన్నారు. అనంతరం ముదిగొండ మండలం పెద్దమండవ జోన్ బూత్స్థాయి సమావేశానికి హాజరైన భట్టి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, టీపీసీసీ సభ్యుడు రాయల నాగేశ్వరరావు, కొమ్మినేని రమేష్బాబు, మందరపు నాగేశ్వరరావు, పసుపులేటి దేవేంద్రం, కందిమళ్ల వీరబాబు, బుచ్చిరామయ్య, అజయ్, పలువురు మండల నాయకులు పాల్గొన్నారు.